Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : ప్రముఖ ఔషద ఉత్పత్తుల కంపెనీ నాట్కో ఫార్మా 2020 మార్చి 31తో ముగిసిన త్రైమాసికంలో 22.59 శాతం తగ్గుదలతో రూ.93.2 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.120.4 కోట్ల లాభాలు సాధించింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.486.7 కోట్లుగా ఉండగా.. క్రితం త్రైమాసికంలో రూ.477.2 కోట్లకు తగ్గింది. 2019-20 ఆర్ధిక సంవత్సరంలో నాట్కో నికర లాభాలు రూ.458.1 కోట్లకు తగ్గాయి. ఇంతక్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.642.4 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. హెపటైటిస్ సి ప్రొడక్ట్ పోర్టుపోలియో అమ్మకాలు తగ్గడం, అంకాలజీ సెగ్మెంట్లో ధరల ఒత్తిడి గతేడాది తమ కంపెనీ ఫలితాలపై ప్రభావం చూపినట్టు నాట్కో పేర్కొంది.