Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : గత నాలుగు దశబ్దాల్లో ఎప్పుడూ లేని విధంగా ఆర్ధిక వ్యవస్థ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో దేశంలో వినియోగదారుల వ్యయం అమాంతం పడిపోయింది. లాక్డౌన్ ఆంక్షలను ఎత్తివేసినప్పటికీ స్టోర్లకు పెద్దగా వినియోగదారులు రావడం లేదు. దీంతో ఉద్యోగాలు ఊడిపోవడంతో పాటుగా విత్త సంస్థలకు రుణ రిస్కులు పెరుగుతున్నాయని బ్లూమ్బర్గ్ ఓ కథనంలో వెల్లడించింది. భౌతిక దూరం వల్ల మార్కెట్లకు వచ్చే వారి సంఖ్య అమాంతం తగ్గింది. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా ఉన్న భారత్ గత 40 ఏళ్లలో ఎప్పుడూ లేని సంక్షోభాన్ని ఎదుర్కొవడం వల్ల వినిమ యం 60 శాతం మేర క్షీణించింది. డిమాండ్లో పెద్ద పురోగతి లేదని బ్లూమ్ బర్గ్ ఇండియా ఎకనామిస్టు అభిషేక్ గుప్తా పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు పడిపోవడంతో నగదు ప్రవాహంపై ఒత్తిడి ఉన్నట్టు తెలిపారు.