Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: గడిచిన జనవరి - మార్చి త్రైమాసికంలో భారత కంపెనీల రాబడిలో 22 శాతం తగ్గుదల చోటు చేసుకోవచ్చని ఇక్రా రేటింగ్ ఎజెన్సీ అంచనా వేసింది. లాక్డౌన్ వల్ల జూన్ త్రైమాసికం రెవెన్యూలో మరింత తగ్గుదల చోటు చేసుకునే అవకాశాలున్నాయని పేర్కొంది. గత రెండు నెలలుగా భారత్లో లాక్డౌన్ అమలు ప్రభావం ఎలా ఉండొచ్చని 184 కంపెనీల వద్ద ఇక్రా సమాచారం సేకరించింది. కరోనా వైరస్ వేగంగా విస్తరించడం ద్వారా మార్చి త్రైమాసికంలోనూ భారత కార్పొరేట్ల ఆదాయంలో భారీగా తగ్గుదల చోటు చేసుకుందని ఇక్రా రేటింగ్స్ కార్పొరేట్ సెక్టార్ వైస్ ప్రెసిడెంట్ షమ్షేర్ దేవన్ పేర్కొన్నారు. అయితే ఎఫ్ఎంసీజీ, కన్సూమర్ డ్యూరెబుల్స్ లాంటి రంగాల్లో మాత్రం స్వల్ప వృద్ధి ఉండొచ్చన్నారు.