Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: రిల యన్స్ జియోలోకి పెట్టు బడుల ప్రవాహం కొనసా గుతున్నది. సౌదీ అరేబి యాకు చెందిన పీఐఎఫ్ కంపెనీ తాజాగా జియో ప్లాట్ఫాంలో సుమారు రూ.11367 కోట్ల (400 మిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టడం ద్వారా 2.32 శాతం వాటాను కొనుగోలు చేయనున్నది. గత 9 వారాల్లో జియోలో వరుసగా ఇది 11వ పెట్టుబడి కావడం విశేషం. జియోలోకి ఇప్పటి వరకు రూ.1.15,693 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. తమ సాంకేతిక సామర్థ్యంపై విదేశీ కంపెనీలు నమ్మకాన్ని చాటినట్టు ఈ సందర్భంగా జియో ఓ ప్రకటనలో పేర్కొన్నది. సౌదీ రాజ్యంతో దశాబ్ధాల నుంచి సుదీర్ఘ, స్నేహపూర్వక సంబంధాలను కలిగి ఉన్నామని రిలయన్స్ సంస్థ చైర్మేన్ ముకేశ్ అంబానీ తెలిపారు.