Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న అనిశ్చితులు, రేటింగ్ సంస్థల ప్రతికూల భవిష్యత్తు ప్రకటన లాంటి సంక్షోభ సమయాల్లో ఇన్వెస్టర్లు పసిడిపై పెట్టుబడులకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో వచ్చే రెండేళ్లలో 10గ్రాముల బంగారం ధర రూ.68వేల స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత ఆర్థికవద్ధి అవుట్లుక్ను ఐఎంఎఫ్ తగ్గించడం, చైనాతో నెలకొన్న సరిహద్దు వివాదాలు, దేశవ్యాప్తంగా కరోనా కేసుల పెరుగుదల భయాలు, అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ర్యాలీ చేసే అవకాశం తదితర పరిణామాలు దేశీయంగా బంగారానికి డిమాండ్ను పెంచుతాయని బులియన్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కరోనా కేసులు తగ్గినా బంగారం ర్యాలీ కొనసాగేందుకు అవకాశం ఉందని మోతీలాల్ ఓస్వాల్ బ్రోకరేజ్ కమోడిటీ విభాగపు అధిపతి కిషోర్ నార్నే అభిప్రాయపడ్డారు. దేశీయంగా వచ్చే ఏడాదిన్నర, రెండేండ్లలో బంగారం ధర రూ.65,000-68,000 శ్రేణిని అందుకునేందుకు అవకాశం ఉందన్నారు. కాగా డాలర్ మారకంలో రూపాయి కదలికపై బంగారం దశ, దిశ ఆధారపడి ఉంటుందన్నారు.