Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : స్టాక్ మార్కెట్లు, రుణ కేటగిరీల్లో నెలకొన్న ఒత్తిడి వల్ల గడిచిన జూన్ త్రైమాసికంలో మ్యూచువల్ ఫండ్స్ ఆస్తులు 8 శాతం తగ్గి రూ.24.82 లక్షల కోట్లకు పరిమితమయ్యాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా వెల్లడించింది. ప్రస్తుతం ఈ పరిశ్రమలో 45 సంస్థలుండగా.. గతేడాది ఇదే జూన్ 30 నాటికి ఎంఎఫ్ల ఆస్తులు రూ.25.5 లక్షల కోట్లుగా ఉన్నాయని తెలిపింది. జూన్ త్రైమాసికంలో నిఫ్టీ 24 శాతం విలువ కోల్పోవడంతో ఆ ప్రభావం మ్యూచువల్ ఫండ్స్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ (ఎయుఎం)పై పడిందని పేర్కొంది. మ్యూచువల్ ఫండ్స్ స్కీమ్ల్లోకి రాబడి తగ్గిందని సామ్కో సెక్యూరిటీస్ ర్యాంక్ఎంఫ్ హెడ్ ఒమ్కేశ్వర్ సింగ్ తెలిపారు. దేశంలోని టాప్ ఎంఎఫ్లు అయినా ఎస్బిఐ ఎంఎఫ్, హెచ్డిఎఫ్సి ఎంఎఫ్, ఐసిఐసిఐ ప్రూడెన్సియల్ ఎంఎఫ్, ఆదిత్యా బిర్లా సన్లైఫ్ ఎంఎఫ్, నిప్పన్ ఎంఎఫ్ల ఎయుఎంలు తగ్గాయి. ఇందులో ఎస్బిఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.64లక్షల కోట్ల ఎయుఎంతో అగ్రస్థానంలో ఉంది. హెచ్డిఎఫ్సీ మ్యూచువల్ ఫండ్ రూ.3.56లక్షల కోట్లతో రెండో స్థానంలో, ఐసిఐసిఐ మ్యూచువల్ ఫండ్ రూ.3.46లక్షల కోట్ల ఎయుఎంతోనూ మూడో స్థానంలో ఉన్నాయి.