Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెప్టెంబర్ 21, 1862 లో విశాఖపట్టణం జిల్లా, యలమంచిలి తాలూకా రామాపురంలో జన్మించి నవంబర్ 30, 1915 దాకా మాత్రమే చలించి స్వయంగా హేతువాదిగా జీవిస్తూ ప్రజలందరికీ అర్ధమయ్యే వాడుక భాషలో రచనలు చేస్తూ సమాజంలో సాంఘీక పరివర్తనకు ప్రయత్నిచిన మహాకవి గురజాడ. వీరి కన్యాశుల్కం నాటకం కొన్ని వందలసార్లు ఎన్నోచోట్ల ప్రదర్షింపబడి పండిత, పామరుల ప్రశంసలందుకోవడమేగాక కన్నడం, ఫ్రెంచి, రష్యన్, ఇంగ్లీష్, తమిళం, హిందీ భాషల్లోకి అనువదింపబడింది. ఆ రోజుల్లో ప్రబలంగా ఉన్న కన్యాశుల్కం, వేశ్యావృత్తి వంటి దురాచారాలపై విమర్శ ఈ నాటకానికి కథావస్తువు వీరు ఇతరత్రా చేసిన చాలా రచనలు సంస్కరణలకు, సమాజాభివృద్ధికి కీలకమైనాయి. కన్యాశుల్కం నాటకానికి సాటిరాగల రచన భారతీయ సాహిత్యంలో మృచ్చకటిక మాత్రమే యని శ్రీ శ్రీ గారంటే గురజాడ చనిపోయినా, అప్పుడే అతడు జీవించడం ప్రారంభించాడు. అని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారన్నారు.
"అభ్యుదయ కవితా పితామహుడు", "కవిశేఖర" అను బిరుదులు. వారి వ్యక్తిత్వ వికాసానికి సూచికలు
గిడుగు వారికి గురజాడ సహాధ్యాయే కాకుండా ప్రాణ స్నేహితులు, సమాజ మార్పుకు దోహదపడిన ద్వయం కూడా గిడుగు వాదనా బలం, గురజాడ రచనాశక్తి. ఎందరో సాంప్రదాయ వాదులకు ఎదురు నిలిచింది. వీరు రాసిన "దేశమును ప్రేమించుమన్న", "పుత్తడి బొమ్మ పూర్ణమ్మ" గేయములు ఎంతో ప్రసిద్ధి గాంచినవి. 1911 లో మద్రాసు విశ్వ విద్యాలయం "బోర్డ్ ఆఫ్ స్టడీస్"లో నియమింపబడి అదే సం. స్నేహితులతో కలిసి "ఆంధ్ర సాహిత్య పరిషత్" ప్రారంభించారు. 1913 లో పదవీ విరమణ చేసిన వీరు మద్రాసు విశ్వవిద్యాలయం వారిచే "ఫెలోషిప్" తో గౌరవింపబడ్డారు. ఏదేమైనా ప్రస్తుత స్త్రీల స్వతంత్ర వ్యక్తిత్వానికి గురజాడే అడుగుజాడ.
నాగిరెడ్డి అరుణ జ్యోతి
సూపరింటెండెంట్, కలెక్టరేట్, సూర్యాపేట
ఫోన్: 9966181561