Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సభి కా ఖూన్ హై షామిల్ యాహఁకి మిట్టిమే, కిసి కే బాప్ కా హిందుస్తాన్ థోడి హై' రహత్ ఇందోరి రాసిన ఓ గజల్లోని ద్విపదం ఇది.
ప్రఖ్యాత ఉర్దూ కవి రహత్ ఇందోరి మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని అరబిందో ఆసుపత్రిలో ఆదివారం ఆగస్ట్ 9న చేరాడు. కోవిడ్-19కు పాజిటివ్ పరీక్షిం చిన తరువాత అతనికి 60శాతం న్యుమోనియా ఉందని డాక్టర్ చెప్పాడు. ఆ తర్వాత కార్డియాక్ అరెస్ట్ కావడం వల్ల మంగళవారం ఆగస్ట్9 సాయంత్రం చివరి శ్వాస పీల్చాడు. ఆయన వయస్సు 70 సంవత్సరాలు.
రహత్ ఇందోరి ఉర్దూ షాయరీలో దిట్ట. అతని షాయరీ, కవిత్వంలో నిగుడార్థాలుంటాయి. వారి ప్రసిద్ధి చెెందిన కొన్ని ద్విపదాలు: సభి కా ఖూన్ హై షామిల్ యాహఁ కి మిట్టిమే, కిసి కే బాప్ కా హిందుస్తాన్ థోడి హై (అందరి రుధిరం ఉంది మిళితమై ఈ నేలలో/ ఎవరి అబ్బ సొత్తుకాదు హిందూస్తాన్. (స్వేచ్ఛానువాదం))
సిఎఎ వ్యతిరేక నిరసనల నేపథ్యం లో తణమూల్కాంగ్రెస్ ఎంపి మహువా మొయిత్రా జూన్ 2019న లోక్ సభలో ఆమె గొంతులో రహత్ ఇందోరి ఈ ఉరుము ద్విపదాలు ప్రతిధ్వనించాయి. భారతదేశంలో పెరుగుతున్న ఫాసిజం సంకేతాలపై ఆమె ఉద్వేగభరితమైన ప్రసంగం చేసింది. రాహత్ ఇందోరి పదాలతో తన ప్రసంగాన్ని ముగించింది.
రహత్ ఇందోరి మరణవార్త తెలియ గానే ప్రజలు అతని ప్రసిద్ధ పంక్తులతో ఆయనను జ్ఞాపకం చేసుకున్నారు.
''కిసి కే బాప్ కా హిందుస్తాన్ తోడి హై.'' ఇదో ఊత పదంగా ప్రజల నొట్లలో నానుతోంది! డాక్టర్ రాహత్ ఇందోరి కవితలోని ద్విపదం ఒక సెంటిమెంట్. లౌకికవాదం.
సిఎఎ వ్యతిరేక నిరసనలపై తన కవిత కోపంగా మారిందని, 2019 డిసెంబర్లో ఇండియన్ ఎక్స్ప్రెస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇందోరి తాను 35 సంవత్సరాల క్రితం ఈ కవితను రాశానని చెప్పాడు. దాన్ని ప్రజలు ఏ విధంగా మలచుకున్నారో తెలియదన్నారు. గత మూడు, నాలుగు సంవత్సరాలలో ఏమి జరిగిందో (నాకు) తెలియదన్నారు.
రహత్ ఇందోరి ఉర్దూ సాహిత్యానికి ప్రసిద్ధమైన కషిచేశారు. ఉర్దూ కవిత్వం, షాయారీ విషయానికి వస్తే ఎదను తాకేలా ఉంటుంది వారి వ్యక్తీకరణ. అందుకే అతనిదో పెద్ద పేరు.
అతను గత 40-45 సంవత్సరా లుగా ముషైరా, కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు. తన కవితలను పఠించడా నికి విస్తతంగా ప్రయాణించారు. అతను భారతదేశంలోని దాదాపు అన్ని ప్రాంతాలలోని ముషాయిరాలలో (కవితా సమ్మేళనం) హాజరయ్యారు. యుఎస్ఎ, యుకె, ఆస్ట్రేలియా, యుఎఇ, కెనడా, పాకిస్తాన్ సింగపూర్, మలేషియా, కువైట్, సౌది అరేబియా దేశాలలో పర్యటించి తన రచనలను పఠించారు. శ్రోతలు, ప్రేక్ష కులు ముగ్దులైయ్యారు.
అతని షాయారీలను చదివిన ప్రతి ఒక్కరూ చివరి నివాళులు అర్పించడం తో, ఉర్దూ పాఠకుల హదయాలలో మరియు మనస్సులలో చెరగని ముద్ర వేశారు.
అతని కవితా నిర్మాణం, కవితావేశం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. చదు వుతూన్నప్పుడు అతని షాయిరీలో ఎమో షన్తో పాటు గొంతులో విభిన్నత గోచర మవుతుంది. భావ భంగిమలు వారి ప్రత్యేకత.
యువకుల నుద్దేశించే ఎన్నో ద్విప దాలు రాశారు. అందులో ఒకటి, 'యుఁ తో హర్ ఫూల్ పె లిఖా హై తోడో మత్, దిల్ మచల్తా హై తో కెహతా హై ఛోడో మత్.' (పూలు కోయడం నిషేధమని రాసి ఉన్నా/ కొట్టు కొంటూన్న గుండె ఘోషిస్తోంది వదిలే యకని.)
కేవలం షాయరీలోనే కాదు సినిమా రంగంలో కూడా చాలా పాటలు రాశారు. బాలీవుడ్ సినిమా రంగంలో అత్యంత నిష్ణాతులైన గీత రచయితలలో ఒకరు. వారు రాసిన సినీ గేయాలున్న కొన్ని హిందీ సినిమాలు- మై తేరా ఆషిఖ్, ఆషియాన్, సర్, జానం, ఖుద్దార్, నారాజ్, మర్డర్, మున్నభాయి ఎంబిబిఎస్, మిషన్ కశ్మీర్, కరీబ్, ఇష్క్, బేగంజాన్, మీనాక్షి, మరియు ఘాతక్ సినిమాలలో.
పాటలు : యే రిశ్తా క్యా కహతా హై (మీనాక్షి), ధువాఁ ధువాఁ, బుమ్రో బుమ్రో (మిషన్ కశ్మీర్), తుంసా కోయి ప్యార కోయి మాసుం నహీఁ హై (ఖుద్దార్), తెరే బిన్ మై కుచ్ భి నహీ (నారాజ్), ఎం బోలేతో మాస్టర్ బి బోలేతో బిన్ దాస్ మాస్టర్ (మున్నభాయి ఎంబిబిఎస్) ఉర్రూతలు ఊగించినవి.
పుస్తకాలు : రుత్, సహి, మేరేబాద్, ధూప్ బహుత్ హై, చాంద్ పాగల్, మౌజూద్, నారాజ్ మొదలైనవి.
రహత్ ఉర్దూ భాష మాజీ ప్రొఫె సర్, చిత్రకారుడు కూడా. ఇండోర్లోని దేవి అహిల్యా విశ్వవిద్యాలయంలో ఉర్దూ సాహిత్యబోధకుడు.
రహత్ ఇందోరి మొదటి భార్య అంజుమ్ రెహబర్. ఆమె కూడా ఉర్దూ భాష ప్రసిద్ధ స్త్రీవాద కయిత్రి.
ఆమె రాసిన ముషాయిరాలో వినిపించిన ఓ గజల్లోని ఓ ద్విపదం గుర్తుకొస్తుంది:
'మిల్నా థా ఎక్ ఇత్తెఫాక్ బిఛడ్నా నసీబ్ థా/ వో ఉతనాహీ దూర్ హౌగయా జిత్న ఖరీబ్ థా మైఁ ఉస్కో దేఖ్ని కో తరస్తీ హీ రహెగయీ/జిస్ శక్స్ కీ హథేలి మే మెరా నసీబ్ థా. 'ఇది చదివితే వింటే ఆమె జీవి తానికి అతి దగ్గరగా ఉన్నదని పిస్తోంది.
రహత్ ఖురైషీ పుట్టి పెరిగింది మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. తన నగరం పై ఉన్న మక్కువతో రహత్ ఇందోరి అని పిలుచుకోబడ్డాడు.
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉన్న ప్రముఖ కవి రహత్ ఇందోరి తన అభిమానులకు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా ట్విట్టర్, మరియు ఫేస్బుక్ ద్వారా తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలియజేస్తూ ఉంటానని హామీ ఇచ్చారు. దురదష్టవశాత్తు దాన్ని పూర్తి చేయలేక పోయారు. కాని వారి ద్విపదం: ''ఏక్ హి నది కె హై యె , దో కినారే దోస్తో, దోస్తాన జిందగీ సె, మౌత్ సె యారి రఖొ'' (''ఒకే నదికి చెందిన/ తీరాలు రెండు మిత్రుల్లారా/ కొనసాగిం చండి స్నేహం జీవితంతో/ మైత్రి మత్యుతో.'') తో తన మిత్రులకు ఇచ్చిన సందేశంలా అయింది.
బాహ్యరూపంలో అతను మన మధ్య లేకపోయినా అతని రచనలు సదా సాహిత్య రంగంలో అమరమై ఉంటా యని అని భావిద్దాం.
- మహమ్మద్ అమ్జద్ అలీ
E-mail: amjuali1993@gmail.com