Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రసిద్ధకవి, రచయిత డాక్టర్ ఏనుగు నరసింహరెడ్డి రచించిన 'తెలంగాణ రుబాయిలు' ఆవిష్కరణ సభ సోమవారం సాయంత్రం 5 గంటలకు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో గల కాళోజి హాల్లో ఉంటుంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ అనువాదకులు జలజం సత్యనారాయణ ఆవిష్కరిస్తారు. ముఖ్య అతిథిగా ప్రముఖకవి వైద్యం భాస్కర్ విచ్చేస్తారు. సభాధ్యక్షులుగా ప్రముఖ కవి, కాళోజి పురస్కార గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి వ్యవహరిస్తారు. సమీక్ష డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చేస్తారు. సభను డాక్టర్ గుంటి గోపి నిర్వహిస్తారు.
- పాలపిట్ట బుక్స్