Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రొట్టమాకురేవు కవిత్వ అవార్డు - 2020
ప్రతి యేటా అక్టోబర్లో అందించే రొట్టమాకురేవు కవిత్వ అవార్డులను ఈ ఏడాది కూడా అందించనున్నారు. షేక్ మహమ్మద్ మియా, కె.ఎల్.నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక అవార్డులలో ఈ సారి అందుకుంటున్న వారి వివరాలు... షేక్ మహమ్మద్ మియా స్మారక కవిత్వ అవార్డుకు కోడూరి విజయకుమార్ 'రేగుపండ్ల చెట్టు', కె.యల్ .నరసింహారావు స్మారక కవిత్వ అవార్డుకు అనిల్ డాని 'స్పెల్లింగ్ మిస్టేక్', మెట్టా నాగేశ్వరరావు 'మనిషోక పద్యం', పురిటిపాటి రామిరెడ్డి స్మారక కవిత్వ అవార్డుకు మెర్సీ మార్గరెట్ రాసిన 'కాలం వాలిపోతున్నవైపు' మొదలగున వారు గెలుపొందినట్లు నిర్వాహకులు శిలాలోలిత, కవియాకూబ్లు పేర్కొన్నారు.
దివ్యాంగుల కథల పోటీ
తెలుగు సాహిత్యంలో దివ్యాంగుల జీవితాలకు స్ఫూర్తినిచ్చే, ఆత్మసైర్యాన్ని నింపే కథలను ప్రచురించాలనే సంకల్పంతో పోటీ నిర్వహిస్తున్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.5000/-, రూ.3000/-, రూ.2000/-లతో పాటు మూడు ప్రత్యేక బహుమతులకు కూడా ఒక్కింటికి రూ.1000/- చొప్పున అదించనున్నారు. కథలను పంపాలనుకునేవారు డి.టి.పి.లో ఎ4 సైజు 8 పేజీలకు మించకుండా, అను లేదా యూనీకోడ్ ఫాంటులో divyangkatha@gmail.com కి డిసెంబరు 1, 2020 తేదీలోగా పంపవచ్చని నిర్వాహకులు రమణ పేర్కొన్నారు. వివరాలకు 9440206899 నెంబరులో సంప్రదించవచ్చు.