Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రముఖ రచయిత్రి తొలి తెలుగు అంతర్జాల సాహిత్య పరిశోధకురాలు (సాహిత్యపీఠం, రాజమండ్రి) దివంగత హేమలత పేరు మీద తెలుగు రాష్ట్రాలలో ఏర్పాటు చేసిన స్మారక పురస్కారాలను 2020 సంవత్సరానికి గాను 'జఖ్మి' కవితా సంపుటి కవయిత్రి నస్రీన్ఖాన్కు, మరో వ్యాస రచయిత్రి కొమ్ము రజితకు ప్రకటిం చారు. డిసెంబర్ 23న హైదరాబాద్లో నస్రీన్ ఖాన్కు ఈ పురస్కారాన్ని పుట్ల హేమలత కుటుంబసభ్యులు ఆచార్య ఎండ్లూరి సుధాకర్, మానస, మనోజ్ఞలు అందజేశారు.
తగుళ్ళ గోపాల్ కు కొత్తపల్లి సాహిత్య పురస్కారం
తగుళ్ళ గోపాల్ 'దండ కడియం' కవితా సంపుటికి కొత్తపల్లి నరేంద్రబాబు సాహిత్య పురస్కారం లభించింది. త్వరలో అనంతపురంలో నిర్వహించనున్న సభలో విజేతకు అవార్డు అందజేసి సత్కరి స్తామని నిర్వాహకులు కొత్తపల్లి సురేష్ బాబు తెలిపారు.