Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'రొట్టమాకురేవు కవిత్వ అవార్డు' సభ
2020 - షేక్ మహమ్మద్ మియా, కె ఎల్ నరసింహారావు, పురిటిపాటి రామిరెడ్డి స్మారక రొట్టమాకురేవు కవిత్వ అవార్డు సభను జనవరి 17న ఉదయం 10:30లకు మలక్పేట ముంతాజ్ కాలేజ్ ఆవరణలోని బి-బ్లాక్లో నిర్వహిస్తున్నట్లు కవి యాకుబ్ పేర్కొన్నారు. ప్రసేన్ అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కె.శివారెడ్డి, గోరటి వెంకన్న, నారాయణశర్మలు రానున్నారు. ఈ కార్యక్రమంలో అవార్డులు గ్రహీతలు కోడూరి విజయకుమార్ (రేగుపండ్ల చెట్టు), మెర్సీ మార్గరెట్ (కాలం వాలిపోతున్నవైపు), అనిల్ డాని (స్పెల్లింగ్ మిస్టేక్), మెట్టా నాగేశ్వరరావు (మనిషోక పద్యం) అని ఆయన పేర్కొన్నారు. వివరాలకు ఫోన్ నెం. 84915 6588 లో సంప్రదించవచ్చు.
కూకట్ల తిరుపతికి 'అలిశెట్టి' స్మారక పురస్కారం
తెలంగాణ రచయితల వేదిక కరీంనగర్ జిల్లా శాఖ ప్రతి యేటా అందించే రాష్ట్ర స్థాయి అలిశెట్టి ప్రభాకర్ స్మారక పురస్కారం 2021 సంవత్సరానికి ప్రముఖ కవి కూకట్ల తిరుపతి ఎంపికయ్యారు. ఈ పురస్కార ప్రదాన సభ అలిశెట్టి జనన మరణ రోజయిన ఈ నెల 12న కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించే కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీ నారదాసు లక్ష్మణరావు పురస్కార ప్రదానం చేస్తారని వేదిక జిల్లా శాఖ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి కందుకూరి అంజయ్య, సి.వి కుమార్లు పేర్కొన్నారు.
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కార ఫలితాలు - 2020
సిరిసిల్లలోని రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2020కు గాను నిర్వహించిన కథల పోటీలో వెంకట్ శిద్ధారెడ్డి కథా సంపుటి సోల్ సర్కస్ ఎంపికైనది. మార్చిలో ట్రస్టు ఆవరణలో నిర్వహించే కార్యక్రమంలో పురస్కార ప్రదానం ఇవ్వనున్నట్లు అవార్డు కమిటీ కన్వీనర్ మద్దికుంట లక్ష్మణ్ పేర్కొన్నారు. వివరాలకు ఫొన్ నెం. 9441677373లో సంప్రదించవచ్చు.
రైతు సమస్యలపై కవితా సంకలనం
వురిమిళ్ళ ఫౌండేషన్, తెలంగాణ సాహితీ సంయుక్త ఆధ్వర్యంలో కవితా సంకలనాన్ని తీసుకు రానున్నారు. ఇందుకు రైతు ఉద్యమానికి మద్దతుగా రాసిన కవితలకు ఆహ్వానిస్తున్నారు. కవితలు పంపాలనుకునే వారు ఈ నెల 15వ తారీఖులోగా 9490099083, 8897765417 వాట్సాప్ నెంబర్లకు పంపవచ్చు. వచ్చిన వాటి నుంచి ఎంపిక చేసిన కవితలతో కవితా సంకలనం ప్రనచురిస్తారు.