Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యం ఒక కళ. దాని ద్వారా సమాజాన్ని ప్రభావితం చేస్తామని సాహిత్యకారులు భావిస్తారు. దాన్ని సాధ్యమైనంత వరకు ప్రజల్లోకి తీసుకు వెళ్లగలిగితే బాగుండని, అలా తీసుకువెళ్లే మనుషుల కోసం చూస్తారు. అలాంటి పనులు కూడా అందరూ చేయలేరు. నిబద్దత ఉన్న మనుషులే దాన్ని భుజానికి ఎత్తుకుంటారు. అలాంటి వ్యక్తి ''నాగళ్ల దుర్గా ప్రసాద్''.
మాది తెనాలి, మేం చెబితే వినాలి అనే మాటతో నాగళ్ల దుర్గా ప్రసాద్ చాలామందికి పరిచయం. నిజానికి ఇతను రెండు తెలుగు రాష్ట్రాల్లో సాహితీవేత్తలఅందరికీ బాగా పరిచయం. ఎందుకు పరిచయం అంటే, ఎంతోమంది పాతతరం రచయితలని ఈ కాలానికి పరిచయం చేసిన వాడు.
ఎందుకీ తలపోత, దుర్గా ప్రసాద్కి మాత్రమే ఎందుకింత క్రియాశీలత. శ్రీరామ గురుకుల పాఠశాలలో దాదాపు పదిహేనేళ్ళ పాటు పిల్లలని చూసి చూసి వాళ్ళతో ఉండి పోవడం వల్ల అతనికి పసితనం అంటుకుందా లేక కేవలం 15 ఏళ్ల వయసులో తండ్రిని కోల్పోవడం వల్ల ఆ పసిమనసులో ఏర్పడిన అగాధంని పూడ్చుకోవడానికి, తాను ఎంచుకోవాల్సిన విషయం ఏదో తేల్చుకునేందుకు సాహిత్యం దోహదం చేసిందా అనే చాలా ప్రశ్నలకి తన కార్యక్రమాల ద్వారా జవాబులు చెప్పాడు.
దుర్గాకి తెలుగు సాహిత్యంతో చాలా సంబంధం ఉంది. ప్రాచీన సాహిత్యాన్ని, ఆ తర్వాత వచ్చిన ధోరణులు, తెలుగు కథ, కవిత్వం, నవల, విమర్శల మీద సాధికారిక పట్టు ఉంది. అస్తిత్వ ధోరణులు మీద తనకంటూ ఒక సదభిప్రాయం ఉన్న వ్యక్తిగా కనబడతాడు. కానీ ఎక్కడా ఆన్ ద రికార్డ్గా తన అభిప్రాయాన్ని వెల్లడి చేయలేదు కానీ, మిత్రుల మధ్యన సంభాషణల మధ్యలో మాత్రం తన అభిప్రాయాల్ని సూటిగా స్పష్టంగా చెప్పేవాడు. ఆయా వర్గాల పట్ల తనకున్న అభిప్రాయం తాను చేసిన కార్యక్రమంలో కనబడింది. తాను ఏర్పాటు చేసిన ''ప్రజ్వలిత'' సంస్థ నుంచి ఇచ్చిన అవార్డులు, లేదా చేసిన సాహిత్య కార్యక్రమాలలో తన ఆలోచనల్ని ప్రతిబింబిచే విధంగా చేశాడు. కేవలం ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి మాత్రమే, తాను కట్టుబడి ఉండలేదనే విషయాన్ని క్రియా రూపంగా చేసి చూపించాడు. ప్రజ్వలిత అనే ఒక సాహిత్య సంస్థను ఏర్పాటు చేయడం ద్వారా అతను ఒక అకాడెమీనో లేదా ప్రభుత్వమో లేక చాలా ఎక్కువ నెట్వర్క్ ఉన్న సంస్థలు చేసే పనులు కన్నా ఎక్కువ పనులు చేశాడు. ప్రతీవారం ఒక సాహితీ ప్రముఖుడిని తెనాలి వాసులకి పరిచయం చేశాడు. అదొక్కటే కాక ఆ కార్యక్రమాన్ని తెనాలి చుట్టుపక్కల ఉండే పల్లెటూళ్లలో సిటీ కేబుల్ ద్వారా ఆ కార్యక్రమాన్ని ప్రసారం చేయడం ద్వారా పల్లెటూళ్ళలోకి కూడా సాహిత్యాన్ని తీసుకువెళ్లిన ఘనతని కూడా నాగళ్ళకి ఆపాదించవచ్చు. 2014లో ప్రారంభం కాబడింది ప్రజ్వలిత. అప్పటినుంచి ఆ సంస్థ క్యాలెండర్ ఏనాడు ఖాళీ లేదు. తెలుగు సాహిత్య చర్చల్లో ఎప్పుడూ ప్రజ్వలిత ఉంది. అందుకు ముఖ్య కారణం దుర్గన్న మాత్రమే. కేవలం సాహితీవేత్తలకేకాక మేలిమి మాటల్ని సంపాదకీయాలుగా రాసిన ఎడిటర్ మిత్రులకు సైతం తన అవార్డ్లని ఇచ్చి తనకు అక్షరం పట్ల ఉన్న మక్కువ చాటుకున్నారు.
పిల్లలు అంటే బోలెడంత మమకారం ఉంది దుర్గన్నకి. గత ఏడాది, సాహిత్యంలో వివిధ భావనలు యువతకి అర్ధం కావాలి అన్న సదుద్దేశంతో ఒక రోజు సదస్సు ఏర్పాటు చేసి, అందులో కవి శివారెడ్డికి ప్రజ్వలిత పురస్కారం ఇచ్చి నెల, ఎన్.వేణుగోపాల్, ప్రో.రఘు, మల్లీశ్వరి, క్రాంతి శ్రీనివాసరావు వంటి ప్రముఖుల చేత పిల్లలకి వివిధ భావనల మీద సెమినార్ పెట్టించి వాళ్ళతో ముఖాముఖి నిర్వహించారు. పిల్లల్లో ఇంకా ఆసక్తి కలిగించాలని, వాళ్ళని మధ్యమధ్యలో కాస్త ప్రశ్నలతో లేదా నవ్వులతో వాళ్ళని ఉత్తేజభరితం చేసేవారు. వాళ్లలో ఇప్పుడు ఎంతమంది వాళ్ల హదయాలని అర్థం చేసుకున్న మనిషి దూరం అయ్యాడని రోదిస్తూ ఉంటారో.
తెనాలి సాంస్కతిక కేంద్రం, ఆ ఖ్యాతిని మరింత ముందుకు తీసుకువెళ్లారు దుర్గా అన్నా. తన సొంత నిధులతో ఒక భవనం నిర్మించి అందులో ఎంతో మంది కళాకారుల చిత్ర పటాలు సేకరించి ఆ హాలు నిండా అలంకరించారు. ఎంత నిబద్దత ఉండాలి ఆ పని చేయడానికి, ఎంత ప్రేమ ఉండాలి సాహిత్యకారుల మీద. కేవలం ఇది అభిమానం ఒకటే ఉంటే సరిపోయే అంశం కాదు అందుకు మనసులో దఢమైన అభిప్రాయం ఉండాలి. ఎలాంటి విమర్శ వచ్చినా తట్టుకుని ఎదురు నిలబడగలిగే ధైర్యం ఉండాలి. ఆ రెండు ఉన్నవాడు దుర్గా అన్నా. ఇలాంటి సాహిత్య కార్యక్రమాలు చేయడం మాత్రమే కాకుండా, ఎన్నో కవితా సంపుటాల్లో కవితా పాదాలు నోటికి కంఠతా వచ్చు, వాటిని సందర్భోచితంగా వాడడం తెల్సు, పద్యాలు, వాటి అర్థాలు, రాగాలు వాటి గానసరళి ఇలా ఒక్కటేమిటి ఎన్నో సాహిత్యపు పరిమళాలు ఉన్న వ్యక్తి. దుర్గా గారితో పాటుగా ఒక సాంస్కతిక బందం ఎప్పుడూ వెంటే ఉంటుంది. అందులో వాయిద్యం, పద్యం పాడే వ్యక్తులు ఉండేవాళ్ళు. ఈయనతో ప్రయాణం ఎంత దూరం అయినా విసుగు అనిపించదు. అందుకే దూర ప్రాంతాల సాహితీ సభలకు దుర్గ అన్న మాత్రమే కాకుండా ఆయనతో ఒక బందం లాగా కొంత మందితో కలిసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ సమూహాలన్ని రెక్కలుతెగిన పక్షుల్లా విలవిల లాడుతున్నారు. దుర్గన్న నిర్యాణం తెలియగానే ప్రజ్వలిత వాఉట్సప్ గ్రూప్ లో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కవులు, కళాకారులు ఎంతో ఆర్తితో చేసిన కామెంట్స్ అందుకు ఉదాహరణ. నిజానికి సాహిత్యాన్ని సజన చేసే వారికి గుర్తింపు గౌరవం దక్కుతాయి. కాని అతి కొద్ది మందికే దాన్ని ప్రజాపక్షం చేసినందుకు కూడా సాహితీ వేత్తలకు దక్కే గౌరవం దక్కుతుంది. దుర్గా అన్నకు కూడా అలాంటి కొన్ని గొప్ప గౌరవాలు దక్కాయి. సుప్రసిద్ధ ''తానా పురస్కారం'', ఏఎన్నార్ అవార్డు, మువ్వా పద్మావతి రంగయ్య ఫౌండేషన్ వారు ఖమ్మంలో దుర్గన్న చేస్తున్న క్రియా పూర్వక సాహితీ సేవకు సన్మానం చేసి గౌరవించుకున్నాయి. ఇంకా గుర్తింపు దక్కవలసిన మనిషి ఇదిగో ఇలా ఇప్పుడే వస్తా అని చెప్పి మళ్ళీ కనబడకుండా వెళ్ళిపోయాడు.
ఇంత సాహితీ సేద్యం చేసిన దుర్గాప్రసాద్. సాహిత్యం వైపు రాలేదా అంటే వచ్చాడు. పదిహేడేళ్లకి తండ్రి చనిపోతే ఆ దుఃఖాన్ని మొత్తాన్ని కాగితం మీద పారబోసుకున్నాడు. తండ్రిని కవితదీరా హత్తుకున్నాడు.
''గతాన్ని మరవడానికి పసితనం కాదు
తెలియని వయసుకాదు
మరిచే ఆలోచన మనసుకు లేదు
మరో ఆలోచన మనసుకు రాదు
కాదులే ఇది స్వప్నం
అవునులే ఇది నగ సత్యం.''
తన హదయం పాషాణం కాదు నర నరానా తన్ను నైరాశ్యం ఆవహిస్తుంటే ఆత్మ విశ్వాసం సన్నగిల్లుతుంది అని మిణుకు మిణుకుమంటున్న భవిష్యత్ని తలచుకుని కుమిలిపోతూ గుండెని చిక్కబట్టుకుని రాసిన వాక్యల్లా అనిపిస్తాయి. అతని ఆవేదనలో అలంకారాలు, అతిశయోక్తుల్తో సంబంధం లేదు ఉండదు. మనం ఎక్కడా ఒక్క మాట కూడా కత్రిమమైన పదాన్నో పదజాలాన్నో చూడం. ఎందుకంటే అది అతని హదయాలాపన. ఇది మాత్రమేకాక ఎన్నో అముద్రిత కవితా పాదాలు ఉన్నాయి. అవన్నీ పరిశీలనగా చూస్తే ఏ గొప్ప కవికి తీసిపోని వాక్యల్లా ఉంటాయి. ఒకవేళ తానే కవిత్వం రాసి ఉంటే కనక, తనకంటూ ఒక వాస్తవిక శైలిని ఏర్పర్చుకునే వారు. కానీ ఆయన మాత్రం తాను కేవలం ఒక మేలిమి రకం పాఠకుడిగా ఉండడానికి మాత్రమే ప్రయత్నం చేసాడు, అలాగే ఉన్నాడు. సాహిత్యాన్ని పోషించిన దేవరాయలు లాగా చిరకీర్తిని సంపాదించాడు. తెనాలి నుంచి యావత్ తెలుగు నేలమీద తానొక రోల్ మోడల్ లాగా నిలబడ్డాడు. సాహిత్యాన్ని లేదా ఏ కళనైనా వారసత్వంగా తీసుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తారు కానీ, ఇలా క్రియరూపంలో ఉన్నదాని ఎవరు భుజాన వేసుకుంటారు, తీసుకున్నా సరే తన కమిట్మెంట్ ఉంటుందా, తన ప్లానింగ్ ఉంటుందాని ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకునే విధంగా పనిచేసిన నాగళ్ల దుర్గా ప్రసాద్ మిగిల్చిన పనిని ఎలా ముందుకు తీసుకు వెళ్ళాలా అని ఆలోచన చేయవలసిన పని ఒకటి మిత్రులుగా మా మీద ఉంది. ఇంత సేవా తత్పరుడుకి నివాళిగా ఒక జాతీయ స్థాయి అవార్డుని కూడా మిత్రులు ఆలోచన చేస్తే బాగుంటుంది. తాను అనారోగ్యంగా ఉండి కూడా ఒక కరోనా జంటకి తనవంతు సాయం అందిస్తూ తాను ఆ బారినపడి చివరకి మనకి అందనంత దూరాల తీరానికి వెళ్లిపోయిన మహా మనిషికి కన్నీటి నివాళి ఇవ్వడం మన అందరి కర్తవ్యం.
- అనిల్ డ్యాని, 9703336688