Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేను ఉద్యమ రీత్యా రేగొండలో ఉంటున్న రోజులవి. నేను నా కుటుంబంతో కలిసి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాను. అదే సమయంలో చందనాల సుమిత్ర గారు రేగొండ హైస్కూల్లో ఉపాధ్యాయులుగా పని చేస్తున్నారు. నేను అద్దెకు ఉంటున్న ఇంట్లోని ఎనిమిదో తరగతి విద్యార్థి ద్వారా చందనాల సుమిత్రగారు నాకు పరోక్షంగా పరిచయ మయ్యారు. ఆవిద్యార్థి స్కూల్లో జరిగే పాఠ్య బోధన మొదలు స్కూల్లో జరిగే ప్రతి అంశాన్ని నాతో పంచుకునేది. అలా ఆ విద్యార్థి ప్రతిరోజు సుమిత్రాదేవి గారి క్లాస్కు సంబంధించిన విషయాలను నాతో ఎక్కువగా పంచుకునేది. అలా ఆ అంశాలని పంచుకునే క్రమంలో సుమిత్రాదేవి గారికి నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకపోయినా నేను ఆమెకు అభిమానిగా మారాను. తన విద్యా బోధనంతా తరగతి గదికన్నా పరిసరాల్లో ఎక్కువగా జరుగుతున్నట్లు తెలిసేది. ఎలాగంటే ఒకరోజు ఆ విద్యార్థి వచ్చి నాతో 'ఈ రోజు మా సుమిత్రాదేవి మేడం చెత్త ఏరిపించింది అని చెప్పింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో భాగమేమో అనుకున్నాను. కానీ ఆ చెత్త ఏరడానికి పది నిమిషాలు టైం ఇచ్చిందని ఏరిన తర్వాత సేకరించిన వస్తువులు ఏంటో చెప్పాలని అడిగిందని చెప్పింది'. మరోరోజు ఆ అమ్మాయి ఒక డ్రాయింగ్ షీట్ పై ఫ్లవర్ వాజ్ గీసుకొని వచ్చింది. స్కూల్లో నుండి వస్తూనే తన డ్రాయింగ్ సీట్ చూపిస్తూ ఒపీనియన్ అడిగింది. ఆ డ్రాయింగ్ షీట్ లో పరిసరాలలో దొరికే గడ్డిపూలు ఉన్నాయి ఇదేంటి ఇలా ఏదైనా మంచి రోజా ఫ్లవర్ వేయలేకపోయావా అన్నాను. తను అత్యంత ఉత్సాహంగా మాట్లాడుతూ మా మేడం స్కూలు చుట్టుపక్కల దొరికే పిచ్చి చెట్ల పూలను ఏరుకొచ్చి ఫ్లవర్వాజులో వేసి గీయమందని చెప్పింది. అలా ప్రతిరోజూ ఏదో ఒక ఎస్సేనో, డ్రాయింగ్లతో పాటు కుటుంబాలలో జరిగిగే సన్నివేశాల్ని పిల్లల్ని రాసుకు రమ్మని కోరేది. అక్కడ తను ఏమడిగినా ఆ విద్యార్థి నా సహాయం తీసుకునేది. అప్పుడు నాకు అనిపించింది. ఇది కదా సరైన విద్యా విధానం అని. పిల్లల్లోని సజనాత్మకతను వెలికి తీయడం కోసం తను నిత్యం పరితపిస్తున్నట్లు నాకనిపించేది. పరిసరాల్లో చెత్తను ఎర్పించి ఏరిన చెత్త లోని వస్తువుల పేర్లు తెలుసుకోవడం అంటే వారిలో పరిసరాల్ని శుభ్రపరచడం తో పాటు ఆ వస్తువుల మూలంగా పర్యావరణానికి ఎలా హాని ఏర్పడుతుందో బోధిస్తూ వస్తు ప్రాముఖ్యతను కూడా తెలియజేసే వారు. పిచ్చి పువ్వులు ఏరుకొచ్చి ఫ్లవర్వాజులో పేర్చి డ్రాయింగ్ వేయించడం చూస్తే అది కామన్గానే కనపడవచ్చు కానీ విద్యార్థుల్లో కళాత్మకతను పెంపొందించడమే కాక పర్యావరణం పట్ల ఆసక్తిని పెంపొందింప జేసి ప్రయత్నం అనక తప్పదు. అంతేకాదు కుటుంబములో జరిగిన అంశాలని విద్యార్థులతో రాయించడం అంటే కుటుంబం పట్ల అవగాహన కల్పించడం తో పాటు వారిని రచయితలుగా మార్చి చరిత్ర నిర్మాతలుగా తీర్చిదిద్దే ఓ బహత్ కార్యక్రమం కూడా మొదలుపెట్టారేమో అనిపించేది. అలా వారి ప్రయత్నంతో ఆ విద్యార్థి ఇప్పుడు వరంగల్ NIT లో సివిల్ ఇంజనీరింగ్ లో m tech చేస్తున్నారు. ఆ విద్యార్థి ఈ మధ్య కాలంలో సుమిత్ర దేవి మేడం శతాబ్దాలను శాసించే దశాబ్దం పేరుతో పుస్తకం ప్రచురించారని ఆ పుస్తకం నువ్వు చదవాలంటూ నాకు అందించింది. అందులోని ఏ కవిత చదివిన అభ్యుదయ సమాజాన్ని స్థాపించడంలో అవి సైంటిఫిక్ ఫార్ములాలుగా ఉపయోగపడతాయని గంటా పదంగా చెప్పొచ్చు.
అందులో ఒక కవిత ''లిప్త'' ఈ కవిత ''గబ్బిలానికి కళ్ళు ఉండవు అయినా నా ఆహారాన్ని అవరోధాల్ని గుర్తిస్తుంది''... అంటూ సమా జాన్ని ఎలా సునిశిత దష్టితో పరిశీలించాలో చెబుతారు. అంతే కాదు
''కొన్ని కళ్ళు భస్మాసుర హస్తాలు సస్యాల్ని సైతం భస్మీకరించి బంజరుల్ని సజిస్తాయంటు'' దుష్ట కళ్ళ దురాగతాల్ని తెలుపుతుంది. చూపుల్లో ''అమ్మ చూపులోని అప్పార వాత్సల్యం కాన రావాలంటూ'' ప్రేమ తత్వాన్ని బోధిస్తూనే ''కళ్ళు తెరిచి అన్యాయాల్ని, అసత్యానల్ని, అక్రమాలను అగ్నికీలల్లో శుద్ధి చేయండి'' అంటూ తిరుగుబాటు తత్వాన్ని బోధిస్తాయి.
తన కవితలు తరగతి గదుల్లో పురుడు పోసుకొన్న జ్ఞాన శిఖలు, బాల్యంతో జట్టుకట్టి సామాజిక దొంతరల్ని శోధించి నవీన సమాజ గమనం వైపు చూపే చూపుడు వేల్లు.
''ఆపరేషన్ ఎడ్యుకేషన్'' కవిత చదివితే మనకు స్పష్టమవుతుంది.
''విరిసీ విరియని పువ్వులు- చాలీచాలని బట్టలు- నిండి నిండని డొక్కలు -ఎవరు వీళ్లు'' అంటూ ప్రశ్నిస్తూ ''రెక్కాడితే గాని డొక్కాడని భారత గ్రామీణ రైతు కుటుంబ సభ్యులు వీళ్ళు'' అంటూ ప్రభుత్వ పాఠశాల పిల్లల స్థితిగతులను తెలియజేస్తూ ''ఈ లేత చేతులకు తెలుసు ప్రేమించడం- శ్రమలో నుంచి జీవన సౌందర్యాన్ని సజించడం'' అంటూ ''పసి హదయాల్లో విషబీజాలు నాటకండి- పనిమాని పాఠాల్ని చదవమని - వారిని రెంటికీ చెడిన రేవళ్ళనం కానీకండి'' అంటారు గ్రామీణ పిల్లలు సహజంగానే శ్రమజీవులుగా పుడతారు వారికి శ్రమ తెలుసు కాబట్టి వారికి వత్తి విద్యను అందించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. రచయిత గారు ఇలా అనేక అనేకం ఆమె రచనల్లో సామాజిక రుగ్మతలపై ఎక్కుపెట్టిన ప్రశ్నలు ఉన్నాయి సమాజం పాఠశాలలోకి ప్రవేశించి నట్టుగా పాఠశాల సమాజంలోకి ప్రవహించేక పోతున్న శేష ప్రశ్నలు ఉన్నాయి. నల్ల తాడు కట్టుకోనైనా దష్టాంతాల్ని తరిమికొట్టాలని ఆత్రుత కనబడుతోంది ఇలా సుమిత్ర గారి రచనల గురించి నేను ఎంత చెప్పినా తక్కువేనేమో ఎందుకంటే ఆమె మరో గిజుభాయి.
- కోగిల చంద్రమౌళి