Authorization
Mon Jan 19, 2015 06:51 pm
25న 'ప్రయాణం' పుస్తకావిష్కరణ సభ
తెలంగాణలో ఎనిమిదివేల కిలోమీటర్లు పర్యటించి, క్షేత్ర స్థాయి పరిశీలన చేసి రాసిన అనేక వాస్తవ అనుభవాల సమహారం ఎం.విప్లవకుమార్, ఎ.విజయ్ కుమార్లు ''ప్రయాణం'' పుస్తకం రాశారు. ఈ పుస్తకావిష్కరణ సభ ఈ నెల 25 గురువారం నాడు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్ కె.శ్రీనివాస్ చేతుల మీదుగా నిర్వహించనున్నారు. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షులు వ్యవహరించే ఈ కార్యక్రమానికి అతిథులుగా జయరాజన్న, ఎన్. వేణుగోపాల్, జాన్ వెస్లీ, ఎస్.వినయ్ కుమార్, డా.కదిరె కృష్ణ, డా.బెల్లి యాదయ్య, డా.పసునూరి రవీందర్, తాళ్ళ నాగరాజు రానున్నారు.
జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు - 2021
2021 సంవత్సరానికి గాను ''వురిమళ్ల పౌండేషన్ - అక్షరాల తోవ'' సంయుక్త నిర్వహణలో జాతీయ స్థాయి కథలు, కవితల పోటీలు నిర్వహించనున్నారు. 'వురిమళ్ల శ్రీరాములు' స్మారక కథల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.3000/-, రూ.2000/-, రూ.1000/- లతో పాటు రెండు కన్సలేషన్ బహుమతులు రూ.500/- చొప్పన అందిస్తారు.
'వురిమళ్ల పద్మజ' స్మారక కవితల పోటీలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా రూ.2000/-, రూ.1500/-, రూ.1000/- లతో పాటు రెండు కన్సలేషన్ బహుమతులు రూ.500/- చొప్పన విజేతలకు అందించనున్నారు. వీటితో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సాహిత్యంలో విశేష కృషి చేస్తున్న వారిలో ఒకరికి ''భోగోజు పురుషోత్తం - సముద్రమ్మ'' గార్ల సాహితీ పురస్కారంతో పాటు రూ.5000/- నగదు బహుమతి అందిస్తారు.
కథలు, కవితలను ఏప్రిల్ 30లోగా భోగోజు ఉపేందర్రావు, ఇ.నెం. 11-10-694/5, బురహాన్పురం, ఖమ్మం - 507001 చిరునామాకు పంపవచ్చు. వివరాలకు 9494773969 నంబరు నందు సంప్రదించవచ్చు.