Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లహరి తిరస్కరించిందన్న అవమానం, కసితో విష్ణు తాను ఉన్నతస్థాయికి ఎదిగి ఆమెకు గుణపాఠం చెప్పాలనుకుంటాడు. కమ్యూనిస్టు నాయకుడు శ్రీరాములు అభిమానాన్ని చూరగొని వారమ్మాయి కమలను పెళ్ళిచేసుకుంటాడు. కమ్యూనిస్టు పార్టీకి రాజీనామా చేసి విష్ణు వ్యాపారవేత్తగా ఎదగడానికి ఎంత పతనం కావాలో అంత పతనం అవుతాడు. తన పట్ల, తన చుట్టూ వున్న వారి పట్ల కసి, ఆధిక్యతా భావంతో అందర్ని దూరం చేసుకుంటాడు. తను ఎదగడానికి కారణమైన అత్తగారి కుటుంబాన్ని అణచివేస్తాడు. వాళ్ళను పురుగుల్లా చూసినా బావమరిది అజరు అంటే భయం. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, దుర్భర దారిద్య్రంలో మగ్గుతూ వుండి కూడా స్థిర చిత్తంతో తన ఆశయాలను, జీవన దృక్పథాన్ని కోల్పోని అజరు, విష్ణుకు కొరకరాని కొయ్యగా తయారవుతాడు. ఆల్కహాలిక్గా మారి చావుకు చేరువైన విష్ణు తన గతాన్ని తలపోసుకుంటూ - తను ఏం సాధించానా అన్న విచికిత్సలో పడి మథనపడడమే 'అహానికి రంగుండదు' నవలగా రూపుదాల్చింది.
అహానికి రంగుండదు (నవల), పి.చంద్రశేఖర ఆజాద్
పేజీలు : 135, వెల : 110/-, ప్రతులకు : 9246573575
- రాహుల్