Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలకోసం కలం పట్టి ప్రాణాలు అర్పించిన అక్షరయోధుడు షోయబుల్లాఖాన్. తన రచనలతో నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన సాహసి. లక్ష్యసాధనలో ప్రాణాల్ని సైతం లెక్కచేయని పత్రికా రచయిత. నిజాలు రాసినందుకే డెబ్బయ్యేండ్ల కిందట రజాకార్లు ఆయన్ని హతమార్చారు. 28 ఏళ్ళ వయసులోనే అసువులు బాసిన షోయబ్ అభిప్రాయాల కోసం బాధల్ని లెక్కచేయని సృజనశీలురకు గొప్ప ఉత్తేజం. తెలంగాణ జర్నలిజం చరిత్రలో ఆయనది సుస్థిరస్థానం. జర్నలిస్టుగా ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం. ప్రతిక్షణాన్ని సృజనాత్మకంగా, నిర్భయంగా జీవించిన ఈ కలం వీరుడి త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన పేరిట రచనల పోటీ నిర్వహించాలని 'నవతెలంగాణ' సంకల్పించింది. లౌకిక విలువలకు కట్టుబడి, మతసామరస్యాన్ని ప్రబోధిస్తూ ప్రజల కోసం పాత్రికేయ వృత్తిని నిర్వహించిన షోయబుల్లాఖాన్ని తలచుకోవలసిన సందర్భమిది. కనుకనే 'షోయబుల్లాఖాన్ స్మారక రచనల పోటీ'ని తలపెట్టింది. కథ, సింగిల్పేజీ కథ, కవిత ప్రక్రియల్లో నిర్వహించే ఈ పోటీలకు తమ రచనలు పంపించాల్సిందిగా తెలుగు సాహిత్యకారుల్ని ఆహ్వానిస్తున్నాం.
రచనలు ఎలా ఉండాలంటే...
- మతోన్మాద హింసను వ్యతిరేకిస్తూ, లౌకికవిలువల వ్యాప్తికి తోడ్పడేలా రచనలు ఉండాలి.
- కుల వివక్ష, మతవివక్ష, లింగవివక్ష వల్ల అణచివేతకు గురయ్యే తరగతుల గురించి ఆలోచింపజేసేవిధంగా ఉండాలి.
- కులాల్ని స్థిరీకరించే విధానాలకు భిన్నంగా కుల నిర్మూలనకు తోడ్పడే దృష్టిని ప్రోది చేసేలా రచనలు ఉండాలి. కుల వివక్ష వ్యతిరేక పోరాటాలు కులనిర్మూలనకు దారితీసే వైపుగా (కొన్ని కులాలకు వ్యతిరేకంగా కొన్ని కులాలను కదిలించేవిధంగా కాదు) జనావళిని చైతన్యపరచాలన్న దృక్పథంతో కూడిన రచనలకు ప్రాధాన్యం.
- ప్రపంచీకరణ నేపథ్యంలో విభిన్న వర్గాల జీవితంలో నెలకొన్న అవస్థలకు చిత్రిక పట్టాలి.
- మహిళల ఆత్మగౌరవం, సాధికారతలు చాటే విధంగా రచనలు ఉండాలి.
- సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతల పట్ల నిరసన వ్యక్తం కావడానికి దోహదం చేసే రీతిన రచనలు రూపొందాలి.
- కనిపించే వాస్తవాల వెనుక ఉండే సూక్ష్మమైన వైరుధ్యాల్ని గుర్తించి చిత్రించే నైపుణ్యం ప్రధానం.
నిబంధనలు- సూచనలు
- కవితలు 20 లైన్లకు మించరాదు. ఇంకా చిన్నవైతే మంచిది.
- సింగిల్ పేజీ కథ నవతెలంగాణ 'సోపతి'లో ఒకపేజీకి సరిపడేలా ఉండాలి.
- కథల పోటీకి పంపే కథలు 'సోపతి'లో మూడు పేజీలకు మించరాదు.
- రచనలపై రచయిత పేరు, చిరునామా రాయకూడదు.
- ఒక రచన ఇదివరలో ఎక్కడా ప్రసారం కాలేదని, ప్రచురితం కాలేదని, ఏ బ్లాగులోనూ, ఫేస్బుక్లోనూ ఉపయోగించలేదన్న హామీ పత్రం జత చేయాలి.
- రచనలు తిప్పి పంపడం కుదరదు. కనుక ఒక జిరాక్స్్ కాపీని రచయితలు తమ దగ్గర ఉంచుకోవాలి.
- పోటీలో గెలుపొందిన, సాధారణ ప్రచురణకు ఎంపికయిన కవితల్ని, కథల్ని నవతెలంగాణ ఆదివారం సంచిక 'సోపతి'లో ప్రచురిస్తాం.
- రచనల ఎంపిక విషయంలో తుదినిర్ణయం నవతెలంగాణ సంపాదక వర్గానిదే. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఫోన్లలో సంప్రదింపులకు తావులేదు.
కథల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 10,000
ద్వితీయ బహుమతి: రూ. 8,000
తృతీయ బహుమతి: రూ. 5,000
10 కథలకు ప్రత్యేక బహుమతులు - ఒక్కొక్క కథకి రూ. 1,000
సింగిల్ పేజీ కథల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 4,000
ద్వితీయ బహుమతి: రూ. 3,000
తృతీయ బహుమతి: రూ. 2,000
10 కథలకు ప్రత్యేక బహుమతులు - ఒక్కొక్క కథకి రూ. 1,000
కవితల పోటీ
ప్రథమ బహుమతి: రూ. 3,000
ద్వితీయ బహుమతి: రూ. 2,000
తృతీయ బహుమతి: రూ. 1,000
10 కవితలకు ప్రత్యేక బహుమతులు - ఒక్కొక్క కవితకి రూ. 500.
రచనలు చేరడానికి చివరి తేదీ: 30 నవంబర్ 2018
కవరుపైన 'షోయబుల్లాఖాన్ స్మారక రచనల పోటీ కోసం' అని రాయాలి.
కవితలు, కథలు ఈమెయిల్లో కూడా పంపించవచ్చు.
రచనలు పంపించాల్సిన చిరునామా:
ఎడిటర్, నవతెలంగాణ
ప్లాట్ నెం: 21/1, యం.హెచ్.భవన్
ఆర్టీసి కళ్యాణ మండపం దగ్గర, అజామాబాద్
హైదరాబాద్-500 020, ఫోను: 94900 99079
Email : sopathisunday@gmail.com
darwajapage@gmail.com