Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేపు 'నిత్యాన్వేషణం' ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, మూసీ సాహిత్య ధార సంయుక్త ఆధ్వర్యంలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు రచన 'నిత్యాన్వేషణం' గ్రంథ ఆవిష్కరణ 13వ తేదీ సాయంత్రం 4.30 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. డా||కె.వి.రమణ, డా||నందిని సిధారెడ్డి, డా||మామిడి హరికృష్ణ, ఆచార్య డి.రవీందర్, ఆచార్య డి.సూర్యా ధనంజరు, డా||శ్రీరంగాచార్య, డా||రాపాక ఏకాంబరాచార్యులు, ఒద్దిరాజు మురళీధరరావు పాల్గొంటారు.
కావ్యమంజరి ఆవిష్కరణ సభ
కీర్తి శేషులు గర్రెపల్లి సత్యనారాయణరాజు రచించిన 'స్వప్న ఫలము, కలస్వనము, రంగప్రభూ శతకము' అనే మూడు కావ్యాల సంకలనం 'కావ్యమంజరి'ని కరీంనగర్ ఫిలిం భవనంలో 18వ తేదీ ఉదయం 10 గంటలకు ఆవిష్కరిస్తారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నందిని సిధారెడ్డి, ఏనుగు నరసింహ రెడ్డి, నాళేశ్వరం శంకరం, గండ్ర లక్ష్మణ్రావు, అనంతా చార్యులు, మాడి శెట్టి గోపాల్ పాల్గొంటారు.
- డా. కాంచనపల్లి
బాల బాలికలకు కథా శిక్షణా శిబిరం
బాలబాలికల్లో కథల పట్ల ఆసక్తి, రచనా కౌశలం పెంపొందించేందుకు డా|| మాడభూషి రంగాచార్య స్మారక కమిటి ఈ నెల 18వ తేదీ హైదరాబాద్ హబ్సీగూడలోని జాన్సన్ గ్రామర్ స్కూల్లో 'కథా శిక్షణా శిభిరం' ఏర్పాటు చేశారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు శిబిరం నిర్వహిస్తారు. శిబిరంలో పాల్గొనేందుకు ఎలాంటి రుసుమూ లేదు. మధ్యాహ్న భోజనం ఉంటుంది. వివరాలకు : 9440444019
హైదరాబాద్ పాత నగర సాహితీ సమావేశాలు
తెలంగాణ సాహిత్య అకాడమి, హైదరాబాద్ పాతనగర రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నవంబర్ 17,18 తేదీల్లో వెంకట్రావు స్మారక ఉన్నత పాఠశాల, లాల్ దర్వాజ ఆవరణలో నిర్వహిస్తారు. తెలంగాణ సాహిత్యం, కవిత, కథ, నవల వంటి ప్రక్రియలపై చర్చలు, కవితా పఠనం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమాల్లో డా||నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, డా||ఎస్వీ సత్యనారాయణ, డా||ఏనుగు నరసింహారెడ్డి, పి.బ్రహ్మానందచారి, జి.మహేష్గౌడ్, చింతపట్ల సుదర్శన్, ఆర్.వి.రామారావు, ఇతర ప్రముఖ సాహితీ వేత్తలు పాల్గొంటారు. వివరాలకు : 9299809212, 9703542598.
- కె.హరనాథ్, ప్రధానకార్యదర్శి
తె.ర.వే. రాష్ట్ర మహాసభలు
ఈ నెల 18వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రం మెయిన్ హాల్లో తెలంగాణ రచయితల వేదిక రాష్ట్ర మహాసభలు ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు జరుగుతాయి.