Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తేజ ఆర్ట్ క్రియేషన్స్, త్యాగరాయ గానసభ సంయుక్త నిర్వహణలో బి.యన్.శాస్త్రిగారిని స్మరించుకుంటూ యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన (ఎం.ఫిల్, పిహెచ్డి పట్టాలు పొందిన) పరిశోధకులకు ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు త్యాగరాయ గానసభలో అభినందన సత్కారం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి డా||నందిని సిధారెడ్డి, , డా||కూరెళ్ళ విఠలాచార్య, డా||ఏనుగు నరసింహారెడ్డి, కళా జనార్దనమూర్తి, బైస దేవదాసు, డా||పెసర వేణుగోపాల్రెడ్డి, డా||గంటా జలంధర్రెడ్డి, గుడిపల్లి వీరారెడ్డి హాజరవుతారు. - డా||పోరెడ్డి రంగయ్య, 9948049864
తుమ్మూరి రాంమోహన్రావు రచనల ఆవిష్కరణ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తేజ ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో తుమ్మూరి రాంమోహన్రావు రచించిన 'కొన్ని నవ్వులు ఏరుకుందామని (కవిత్వం)', 'మహెఫిల్లో కోయిల (తెలుగు గజళ్ళు)' పుస్తకాల ఆవిష్కరణ ఈ నెల 29వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఇందులో డా||తిరుమల శ్రీనివాసాచార్యులు, డా||కె.వి.రమణ, డా||నందిని సిధారెడ్డి, డా||ఏనుగు నరసింహారెడ్డి, మామిడి హరికృష్ణ, డా||ద్వా.నా.శాస్త్రి, నాగబాల సురేష్ కుమార్, రమణ వెలమకన్ని, తాళ్ళపల్లి మురళీధర గౌడ్ పాల్గొంటారు.
'మొలుక బియ్యం' పుస్తకావిష్కరణ
చెన్నమనేని ప్రేమసాగర్ రావు కవిత్వం 'మొలుక బియ్యం' పుస్తకావిష్కరణ సాహితీ సోపతి ఆధ్వర్యంలో కరీంనగర్ ఫిలిమ్ భవన్లో డిసెంబర్ 2వ తేదీ ఉదయం 10గంటలకు జరుగుతుంది. ఇందులో కూకట్ల తిరుపతి, డా|| గండ్ర లక్ష్మణ రావు, దాస్యం సేనాధిపతి, అన్నవరం దేవేందర్, గాజోజు నాగభూషణం, మాడిశెట్టి గోపాల్, డా|| బి.వి.ఎన్.స్వామి పాల్గొంటారు.
- కూకట్ల తిరుపతి,
99492 47591