Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తేజ ఆర్ట్ క్రియేషన్స్ సంయుక్త ఆధ్వర్యంలో డా||వాణి దేవులపల్లి వ్యాస సంపుటి 'అస్తిత్వ పరిమళాలు' ఆవిష్కరణ సభ ఈ రోజు సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. ఇందులో డా||నందిని సిధారెడ్డి, ఆచార్య బన్న అయిలయ్య, అల్లం నారాయణ, మామిడి హరికృష్ణ, కట్టా శేఖర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, డా||ముదిగంటి సుజాతారెడ్డి, ప్రభాకర్ జైని, డా||కొండపల్లి నీహారిణి పాల్గొంటారు.
రాఖీ 'లబ్డబ్' పుస్తకావిష్కరణ
గొల్లపెల్లి రాంకిషన్ (రాఖీ) 'లబ్డబ్' పుస్తకావిష్కరణ ఈ నెల 9వ తేదీ ఉదయం 9.45 గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో జరిగే ఈ కార్యక్రమానికి దేశపతి శ్రీనివాస్, అయాచితం శ్రీధర్, మామిడి హరికృష్ణ, వి.అరవింద్, కోసూరి లక్ష్మణరావు, వొజ్జల శరత్బాబు, కె.ఎస్.అనంతాచార్య పాల్గొంటారు.
9న 'ఆకాశమంత పావురం' పరిచయ సభ
పెనుగొండ బసవేశ్వర్ కవిత్వం 'ఆకాశమంత పావురం' పుస్తక పరిచయం తె.ర.వే. కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 9 తేదీన ఉదయం 10 గంటలకు కరీంనగర్ ఫిలిమ్ భవన్ లో జరుగుతుంది. ఈ సభలో గాజోజు నాగభూషణం, డా|| యాకూబ్, వేముల శ్రీనివాసులు, వై.వేంకటేశ్వర్లు, కె.వేణుగోపాల్ రావు, శిలాలోలిత, అన్నవరం దేవేందర్, బూర్ల వేంకటేశ్వర్లు, అంజయ్య, గోపాల్, కూకట్ల తిరుపతి పాల్గొంటారు.
- కూకట్ల తిరుపతి, 99492 47591
అంపశయ్య నవీన్కు 'లోక్నాయక్' పురస్కారం
లోక్నాయక్ ఫౌండేషన్ సాహిత్య పురస్కారాన్ని ఈ ఏడాది ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్కు ప్రకటించారు. ఆయనకు ఈ పురస్కారం కింద రూ.1.5లక్షల నగదు అందజేస్తారు. 2019, జనవరి 19న విశాఖపట్నంలో జరిగే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు.
9న, 'జీవితం' ఆవిష్కరణ సభ
డిసెంబర్ 9న తాయమ్మ కరుణ కథల సంపుటి 'జీవితం' పుస్తకావిష్కరణ.
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుంది.
సభకు విమల మోర్తాల అధ్యక్షత వహిస్తారు.
ఖాసిం, ఏకే ప్రభాకర్, నళిని, ఆర్టిస్ట్ బి.పద్మారెడ్డి ప్రసంగిస్తారు.