Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హైదరాబాద్ బుక్ ఫెయిర్'లో రచయితలకు సదవకాశం
తెలుగు రచయితలు రాసిన పుస్తకాలను డిసెంబర్ 15 నుండి 25 తేదీలలో జరగనున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్లో ప్రదర్శన, అమ్మకానికి వుంచవచ్చు. ప్రతి రచయిత, వారి రచనలలో ఐదింటిని ఐదు కాపీల చొప్పున ప్రదర్శనలో వుంచవచ్చు. దీనికి ప్రత్యేక రుసుం వుంటుంది. రచయిత ఇచ్చిన పుస్తకాలను సందర్శకులకు అమ్మేందుకు గాను నిర్వహణ ఖర్చుల నిమిత్తం 30శాతం తగ్గింపుతో ఇవ్వాలి. పై నిబంధనలకు అంగీకరించిన రచయితలు వారి పుస్తకాలను డిసెంబర్ 10 లోపుగా చిక్కడపల్లి నవతెలంగాణ పుస్తకశాలలో ఇచ్చి తగిన రసీదు పొందవచ్చు.
వివరాలకు : 1-8-538/4, నవతెలంగాణ బుక్ హౌస్, పిస్తా హౌస్ పక్క సందు, చిక్కడపల్లి, హైదరాబాద్ - 20. ఫోన్ : 9490099373
- కె.చంద్రమోహన్, కార్యదర్శి
కాంచనపల్లి కథా సంపుటి ఆవిష్కరణ
ఈ రోజు సాయంత్రం 6 గంటలకు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో కాంచనపల్లి కథా సంపుటి 'ఓ వర్షం కురిసిన రాత్రి' ఆవిష్కరణ జరుగుతుంది సభలో కె.వి .రమణాచారి, నందిని సిధారెడ్డి, అయాచితం శ్రీధర్, బి.ఎస్. రాములు, జూలూరి గౌరీ శంకర్, ఏనుగు నరసింహ రెడ్డి, కె.విమల పాల్గొంటారు
14న కావ్య పరిమళం
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రతి నెలా నిర్వహించే కావ్య పరిమళంలో భాగంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో వానమామలై జగన్నాధాచార్యులు రచించిన 'రైతు రామాయణం'పై డా||గండ్ర లక్ష్మణరావు ప్రసంగం వుంటుంది. సభకు డా||నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
- డా|| ఏనుగు నరసింహారెడ్డి
'దేశం లేని ప్రజలు' ఆవిష్కరణ
డా||ప్రసాదమూర్తి కొత్త కవితా సంపుటి 'దేశం లేని ప్రజలు' ఆవిష్కరణ సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో జరుగుతుంది.
రామా చంద్రమౌళికి
రంగినేని ఎల్లమ్మ పురస్కారం
రామా చంద్రమౌళి 'తాత్పర్యం' కథా సంపుటి 'రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2018' కి ఎంపికైంది. 2019 ఫిబ్రవరిలో సిరిసిల్ల రంగినేని చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేసే కార్యక్రమంలో ఈ పురస్కారాన్ని రామా చంద్రమౌళికి ప్రదానం చేస్తారు.
శిఖామణి, ఇబ్రహీం నిర్గుణ్లకు విమలాశాంతి పురస్కారాలు
'2018 విమలాశాంతి సాహిత్య పురస్కారాలు'కు శిఖామణి రచన 'చూపుడు వేలు పాడే పాట', ఇబ్రహీం నిర్గుణ్ రచన 'ఇప్పుడేదీ రహస్యం కాదు' కవితా సంపుటాలు ఎంపికయ్యాయి. వీరిని 2019 జనవరిలో జరిగే పురస్కార ప్రదానోత్సవ సభలో నగదు, పురస్కార జ్ఞాపికతో సత్కరిస్తారు.
ముట్టూరి కమ్మలమ్మ స్మారక జాతీయ స్థాయి పోటీ ఫలితాలు
ముట్టూరి కమలమ్మ స్మారక జాతీయస్థాయి దీపావళి చిన్న కథల పోటీల్లో గతజల సేతు బంధనం (కానాల శారద - మదనపల్లె), నన్ను మన్నించండి! నాన్నా!! (కె.వి.లక్ష్మణరావు - మానేపల్లి), ఒంటరి మబ్బు (మంత్రవాది మహేశ్వర్ - హైదరాబాద్), కొత్త చిగురు (కళా గోపాల్ - నిజామాబాద్), సాహసం (నిమ్మగడ్డ కాశీ విశ్వేశ్వర శర్మ - నందిగామ), ముగింపు (బండి ఉష - ఖమ్మం) కథలు ఎంపికయ్యాయి.
రాణీ ప్రసాద్కు 'బాలకుటీర్ ప్రతిభా పురస్కారం'
డా|| కందేపి రాణీప్రసాద్కు శ్రీ వెంకటేశ్వర బాల కుటీర్ సంస్థ జాతీయ స్థాయిలో అందించే బాలకుటీర్ ప్రతిభా పురస్కారం ప్రకటించారు. ఈ రోజు గుంటూరులో జరిగే లలిత కళా ఉత్సవాల్లో పురస్కారం, నగదు బహుమతిని ప్రదానం చేస్తారు.
కథ - కవితల పోటీలు
విశాలాక్షి సాహిత్య మాసపత్రిక 'విశాలాక్షి సాహిత్య మాసపత్రిక డ మక్కెన రామసుబ్బయ్య స్మారక కథ - కవితల పోటీలు' నిర్వహిస్తున్నది. కథలు నేటి సమాజ పరిస్థితులకు ప్రతీకగా వుండాలి. కథ 7-9 పేజీలకు మించకూడదు, కవితలు 30 లైన్లకు మించకూడదు. కథలు, కవితలను ఈ నెల 30వ తేదీ లోపు విశాలాక్షి సాహిత్య మాస పత్రిక డ మక్కెన రామసుబ్బయ్య స్మారక కథ - కవితల పోటీలు', విశాలాక్షి సాహిత్య మాస పత్రిక, 27-2-1003, శ్రీనివాసనగర్, బాలాజీనగర్ చివర, నెల్లూరు - 524002.
వివరాలకు : 9885457494
ఆన్లైన్ కథల పోటీ
తెలుగు ప్రతిలిపి 'కథల పండుగ' పేరుతో ఆన్లైన్ కథల పోటీ నిర్వహిస్తుంది.
వివరాలకు : జాని తక్కెడశిల, వాట్సప్ : 9491977190, మొబైల్ : 7259511956