Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఛాయా ఆహ్వానం
ఈ నెల 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఆఫ్సర్ 'సాహిల్ వస్తాడు' మరికొన్ని కథలు పుస్తక సభ హైదరాబాద్ స్టడీ సర్కిల్ దోమలగూడలో జరుగుతుంది.
కౌముది ఫైండేషన్ తొలి కానుక
కౌముది ఫౌండేషన్, తెలంగాణ సాహితి సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఖమ్మంలో 'కౌముది జీవితం - సాహిత్యం' పుస్తకావిష్కరణ సభ జరుగుతుంది. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, నందిని సిధారెడ్డి, ఖాదర్ మొహియుద్దీన్, అల్లం నారాయణ, జూలూరి గౌరీశంకర్, యాకూబ్, బన్న ఐలయ్య, శిలాలోలిత తదితరులు పాల్గొంటారు.
పుస్తక ఆవిష్కరణ
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, అఖిల భారతీయ సాహిత్య పరిషత్ సంయుక్త ఆధ్వర్యంలో డా|| కూర్మాచలం శంకరస్వామి రచించిన 'అంతర్గీత' ఆధ్యాత్మిక వ్యాస సంపుటి ఆవిష్కరణ ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటకు రవీంద్రభారతి సమావేశమందిరంలో జరుగుతుంది. డా||కె.వి. రమణాచారి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, పర్యాద కృష్ణమూర్తి, డా||అమ్మంగి వేణుగోపాల్, అశ్వాపురం వేణుమాధవ్, గోవిందం వేణుగోపాలస్వామి, కందుకూరిశ్రీరాములు, ఆచార్య జ్యోతిరాణి, పర్యాద సరళ, పుల్లగూర్ల సాయిరెడ్డి, త్రిదండపాణి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొంటారు.
- డా||కూర్మాచలం శంకరస్వామి, 7702435110
కథలపోటీ 2019
హ్యూస్టన్ అమెరికాలోని అర్చన ఫైన్ ఆర్ట్స్ సంస్థ, శారద సత్యనారాయణ మెమోరియల్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో 'కథలపోటీ 2019' నిర్వహిస్తున్నారు. నవరసాల్లో ఏదో ఒక అంశం మీద యూనీకోడ్లో టైప్ చేసి, వర్డ్ డాక్యుమెంట్లో మాత్రమే 4 పేజీలలో కథను రాసి, మెయిల్ ద్వారా మార్చి 31వ తేదీలోపు పంపాలి.
చిరునామా: rachanalu2019@gmail.com.
- జ్యోతి వలబోజు, నిర్వాహకురాలు
ఉగాది బాలల కథల పోటీ
సహజ సాంస్కృతిక సంస్థ విజయనగరం వారు బాలల కథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నారు. కథలు పిల్లలకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ ఆలోచనలను రేకెత్తించే విధంగానూ; బంధాలు, కరుణ, దయ కలిగి ఉండేలా కథలు మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి. కథల నిడివి చేతివ్రాతలో మూడు పేజీలు, డిటిపిలో రెండు పేజీలు మించరాదు. కథలను పోస్టు ద్వారా గాని కొరియర్ ద్వారా గాని మాత్రమే పంపాలి. కథలు ఫిబ్రవరి 20 తేదీలోపు అధ్యక్షులు, సహజ సాంస్కృతిక సంస్థ, 24-8-1, సమీరా రెసిడెన్సి, లింగ దారి పేట, రాజ్యలక్ష్మి థియేటర్ దారి, విజయనగరం 535002 చిరునామాకు పంపాలి.
- ఎన్.కె.బాబు, ప్రెసిడెంట్ (సహజ)
జగన్నాథశర్మకు లక్ష్మీనారాయణ జైనీ పురస్కారం
జగన్నాథ శర్మ ఆయలసోమయాజుల గారి 'మొదటి పేజి కథలు' కథాసంపుటి 'లక్ష్మీనారాయణ జైనీ జాతీయ సాహితీ పురస్కారం 2019' కి ఎంపికైనది. ఈ నెల 29వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతిలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఎన్.గోపి, నందిని సిధారెడ్డి, సుధామ, ఎల్.బి.శ్రీరాం, మామిడి హరికృష్ణ, వేలూరి శ్రీదేవి, బిక్కి కృష్ణ, నెల్లుట్ల రమాదేవి, గుడిపాటి, వాణీ దేవులపల్లి పాల్గొంటారు.
- డా. ప్రభాకర్ జైనీ; ఛైర్మన్, జైనీ ఇంటర్నేషనల్ ఫౌండేషన్
జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు
రావి రంగారావు సాహిత్య పీఠం ప్రకటించిన 'జనరంజక కవి ప్రతిభా పురస్కారాలు' పోటీ ఫలితాలను ప్రకటించారు. 1. సిరికి స్వామినాయుడు (మట్టి రంగు బొమ్మలు - వచన కవితలు), 2. చిత్తలూరి సత్యనారాయణ (నల్ల చామంతి - వచన కవితలు), 3. భైరి ఇందిర (సవ్వడి), 4. బెలగాం భీమేశ్వరరావు (మా ఇంటి దేవతలు) ఎంపికయ్యారు. ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం గుంటూరులో జరిగే సభలో ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు.
- నర్రా ప్రభావతి, కన్వీనర్ - రావి రంగారావు సాహిత్య పీఠం
క్రీడా కథలకు ఆహ్వానం
సాహితీ ప్రచురణలు తమ రెండవ కథల సంకలనంకోసం క్రీడలు కేంద్ర బిందువుగా వున్నా కథలను ఆహ్వానిస్తున్నారు. గతంలో ప్రచురితమయినవైనా, అముద్రితాలయినా, కొత్తగా రాసినవైనా మార్చి 10వ తేదీలోపు ప్లాట్ నెం.32, హౌ.నెం.8-48, రఘురాం నగర్ కాలనీ, ఆదిత్య హాస్పిటల్ లైన్, దమ్మాయిగూడ, హైదరాబాద్ - 83 చిరునామాకు పంపాలి. వాట్సాప్ నెం : 9849617392, ఇ మెయిల్ : kmkp2025@gmail.com
- కోడీహళ్ళి మురళీమోహన్, కస్తూరి మురళీకృష్ణ