Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పోరాటాలు..
ఎప్పటికీ కుట్రలో భాగం కానేకావు.
ఉద్యమాలు..
చారిత్రక అత్యవసరమే కానీ
అనవసరమెప్పటికీ కానే కాబోవు.
దోపిడీదారులకు..
ప్రాంతఅస్తిత్వ సమరమూ పెద్దకుట్రే.
భగత్ సింగ్ ..
'డూ ఆర్ డై' నినాదమూ దేశద్రోహమే.
మౌలిక సమస్యల్ని
గుర్తించక మౌనం దాల్చిన్నప్పుడు
చరిత్ర స్పహ లేకుండా
ఉద్యమకారుల్ని అణగదొక్కినప్పుడు..
బుద్ధి జీవులు కలాలుగానో..
మేధావులు గళాలుగానో..
నిరసన స్వరమై ప్రతిఘటిస్తుంటారు.
రాజ్యంపై సంఘవిద్రోహుల్లా
కవులెప్పుడు కుట్రలు చేయరు.
ఫాసిజం రాక్షసుల్లా
జనాలపై విరుచుకు పడ్డప్పుడు
కలాలు గట్టిగా మాట్లాడుతాయంతే !
- అశోక్ అవారి