Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నేడు పూలబాట ఆవిష్కరణ సభ
పింగళి వేంకట కృష్ణారావు రచించిన 'పూలబాట' బాలశతకం ఆవిష్కరణసభ ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఎల్.బి.నగర్ సౌభాగ్య కమ్యూనిటీ హాల్లో జరుగుతుంది. 'సాహితీకిరణం' సంపాదకులు పొత్తూరి సుబ్బారావు అధ్యక్షతన జరిగే ఈ సభలో పుస్తకాన్ని ప్రముఖ సాహితీవేత్త సుధామ ఆవిష్కరిస్తారు.
5న చైతన్యప్రకాశ్ సంస్మరణ సభ
ప్రముఖ రచయిత చైతన్యప్రకాశ్ సంస్మరణ సభ ఈ నెల అయిదో తేదీన రవీంద్రభారతి కాన్ఫరెన్స్హాలులో జరుగుతుందిన తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సభలో నందిని సిధారెడ్డి, కాశీం, కె.పి. అశోక్కుమార్, వి. శంకర్, కందుకూరి శ్రీరాములు ప్రభృతులు ప్రసంగిస్తారు.
7న రెండు పుస్తకాల ఆవిష్కరణ సభ
డా|| కొండపల్లి నీహారిణి కథల సంపుటి - రాచిప్ప, సాహిత్య వ్యాసాల సంపుటి - సృజన రంజని- ఆవిష్కరణ సభ ఈ నెల ఏడో తేదీ ఉదయం పదిన్నర గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో జరుగుతుందని తెలంగాణ రచయితల సంఘం ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ రెండు పుస్తకాలని నందిని సిధారెడ్డి, ముదిగంటి సుజాతారెడ్డి ఆవిష్కరిస్తారు.
8న కావ్య పరిమళం సభ
తెలంగాణ సాహిత్య అకాడమీ నెలనెలా కావ్యపరిమళం పరంపరలో భాగంగా ఈ నెల 8వ తేదీన సాయంత్రం ఆరుగంటలకు రవీంద్రభారతి మినీహాల్లో సభ జరుగుతుంది. కాళోజీ 'నా గొడవ'పై తూర్పు మల్లారెడ్డి ప్రసంగిస్తారు, సభకు నందిని సిధారెడ్ది అధ్యక్షత వహిస్తారని తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి తెలియజేశారు.
బండారి రాజ్ కుమార్కు యువపురస్కారం
తెలంగాణ రాష్ట్రం,వరంగల్ రూరల్ జిల్లా పాతమగ్ధుంపురం గ్రామానికి చెందిన కవి బండారి రాజ్ కుమార్కు 2018 సంవత్సరానికిగాను కలకత్తా భారతీయ భాషా పరిషత్ యువపురస్కారాన్ని ప్రకటించింది. మార్చి 15డ16 తేదీలలో కలకత్తాలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో పురస్కార ప్రధానం జరుగుతుంది. పురస్కారం కింద రూ.21,000/- (ఇరవై ఒక్క వేల రూపాయలు) నగదు,ప్రశంసా పత్రం,శాలువా ప్రదానం చేస్తారు.