Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వసంతరాగమాలిక, శ్రమజీవుల కవన వాటిక ''జవ్వని'' దీర్ఘకావ్యం. నానీల తోరణంతో ప్రారంభమైన కవి పెద్దోజునరేష్. భాషా సాహిత్యాల అస్తిత్వం ఏమిటో ఔన్నత్యాన్ని, గొప్ప తనాన్ని తెలుగు భాషను సాహిత్య మూర్తులను కీర్తిం చాడు. అతి ప్రాచీనమైన తెలుగు భాషను దాని లయా మాధుర్యతను చాటిన ఈ దీర్ఘకావ్యంలో భావు కతను వీడక శిల్పశక్తిని, ఏకసూత్రతను చాటాడు. భావ వ్యక్తీకరణకు భాషే ప్రధాన సాధనం. వివిధ కాలాల్లోని కవులు తమతమ భావాలను భాష ద్వారానే వ్యక్తం చేశారు. సమాజంలో కవులు చేసిన సాహిత్య భాషా సేవలను సమాజంతో పంచుకొని, భవిష్యత్ తరాలకు నన్నయ్య నుండి, సినారె, అలిశెట్టి ప్రభాకర్ దాకా వారి సృజనాత్మకతను కీర్తించాడు. జాతికి, సమాజానికి సాహిత్య ప్రయోజనానికి ఎంతో దోహదపడుతూనే వుంది.
ఈ జవ్వని కవితాజవ్వని నవయవ్వనత్వంతో నిత్య నూతనంగా పచ్చదనంతో పరిమళించాలని కవి ఆకాంక్షి స్తున్నాడు. అస్తిత్వాన్వేషణ అంతర్ ఆరాటంతో అక్షరాల్లో శ్వాసిస్తూ గ్రాంథిక బంధనాల్లో నుండి మాండలిక ఛాయలతో ప్రజాకవిత్వంగా సాహిత్యం పరిణతి సాధించింది. పెద్దోజు నరేష్ గతాన్ని వర్తమానాన్ని భవిష్యత్తు భావ ప్రపంచాలుగా ఆవిష్కరణలకు కల్పనకు జోడించి వాస్తవాన్ని పండించాలి. అప్పుడే పెద్దోజు అక్షర క్రీడను నింపుకొంటాడు.
కవిత్వం కంటే మరొక అద్భుతమైన సాధనం లేదు. నరేష్కు చక్కని కవిత్వం రాసే నేర్పు ఓర్పు రావాలని ఆశిస్తున్నాను. అతని అనుభూతి అతనిదే. అనుభవాల ప్రపంచాలలో రాటు దేలుతాడు.
నరేష్ ఒకచోట అన్నట్లుగా లేలేత పెదవులపై విరిసిన/ తరగని నవ్వుల సిరివెన్నెల/తొలకరి వర్షానికి పులకించి/ పొటమరించిన క్రొంజివురు. సెలయేటి ప్రవాహంగా సాగిన అక్షర ప్రవాహం తనది. చాలా సౌకుమార్యాన్ని ప్రదర్శిస్తాడు ఈ కవి. భావ వారధిగా వచ్చిన సాహిత్య సంస్కృతి వారసత్వాన్ని తమలపాకంత సున్నితంగా పలకరిస్తుందంటారు కవి పెద్దోజు.
యువకవి నరేష్ మరిన్ని వచన కావ్యాలతో చక్కని సామాజిక ప్రయోజనం గల కవితాక్షరాలు అల్లుకొని కవితాశక్తిని ప్రదర్శిస్తాడని ఆశిస్తున్నాను.
ఆచార్య డా|| బన్న అయిలయ్య, ఆచార్య ఎస్. రఘులు, సినీ గేయరచయిత మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ కవి పోతగానిల ముందుమాటలు ఈ సంపుటికి మరింత తేజస్సును సంతరించాయి.
- సిహెచ్. ఆంజనేయులు,
7702537453