Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భాష లేకుండా మన జీవితం ఎలా ఉంటుందో ఊహించగలమా! ఆది మానవులు కేవలం సంజ్ఞల భాషతో జీవితాన్ని గడిపిన ఆ గడ్డురోజుల గురించి నెమరేసుకుంటే, లేదా వారి భాష చరిత్ర చదివితే కొంత వింతగానే ఉంటుంది. అలా అలా కొన్ని వందల వేల సంవత్సరాల తర్వాత మాతభాష మాటల రూపంలో మొగ్గ తొడిగింది. ప్రపంచం మనకు తెలియకుండానే మారిపోయింది. ఓ భాష ఓ భాష చొప్పున అనేక భాషలు పుట్టుకొచ్చాయి. అందులో నుంచే వివిధ ప్రక్రియలలో సాహిత్యం వికసించింది. అది మూడు పూవులారు కాయలై దినదినాభివద్ధి చెందుతోంది. అలాంటి ప్రాచీన భాషలలో తెలుగు ఒకటి. ఇది ద్రావిడ భాషా కుటుంబానికి చెందినది. అంతేకాదు మన దేశపు మూలవాసుల భాష.
కాలక్రమంగా పురోగతి పొందుతూ 'ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్' గా గుర్తింపు పొంది, ఎన్నో తరాలుగా వృద్ధి చెంది వికసించింది. చాళుక్యుల పాలనలో సాహిత్యం స్వర్ణయుగం చూసిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
భాష నోటి మాటయేగాక, దశ్యంగా, దష్టిగా పరిపూర్ణ మాధ్యమంగా మారింది. భాష పండితుల నోళ్ళలోనే గాక గ్రామాలలో, పట్టణాలలో జన సామాన్యుల నోళ్ళలో నానుతోంది. సాహిత్యకారుల రచనలతో ప్రాణం పొసుకొంటోంది.
భాషల వైవిధ్యం కూడా ఆశ్చర్యజనకంగా గోచరిస్తోంది. సాహితీ అక్షరం, వాక్యాల తళుకు, ఈ రెండింటి సమ్మేళనంతో ఉద్భవించే ధ్వని వేలాది రూపాలను కలిగి ఉంది. ఇది మానవ కషి యొక్క అద్భుత చమత్కారం.
భాషల మీద పట్టు, భాషశక్తిని ఉపయోగించే తీరుపై అధారపడి ఉంటుంది. భాషల సంబంధం, సాంఘిక ఏకీకరణ, రాజకీయ ఆధిపత్యంతో అనుసంధానమై ఉంది. ప్రభుత్వం అక్కడక్కడ కొన్ని కొన్ని రాష్ట్రాలలో భాష పట్ల సవతి తల్లి ప్రేమ చూపుతోంది. రాష్ట్రాలలో భాషలను అభివద్ది చేయడానికి కొన్ని సంస్థలు కృషి చేస్తున్నా విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా అధికార భాషగా, బోధనాభాషగా అమలు కావలసిన రీతిలో అమలు కావడం లేదన్న ఆందోళనలు అంతటా చర్చానీయాంశం కావడం గమనార్హం. ఈ చర్చలకు మూలం భాషపట్ల అచంచలమైన ప్రేమనే అని అర్థం చేసుకోవాలి.
భాషాపరంగా హిందీ బెల్ట్, నాన్ హిందీ బెల్ట్ గా విభజింప బడినా ఈ రెండింటికీ భిన్నంగా పరభాష అయిన ఆంగ్ల భాష మన దేశంలో నిలదొక్కుకుంది! అంతేగాక ఆంగ్ల ఆధిపత్యం కొనసాగుతోంది. భారతీయ భాషలు దీనికి మూల్యం చెల్లిస్తున్నాయి. ఆంగ్ల భాష ద్వారా పురోగతిని సాధించవచ్చనే వలస మనస్తత్వం ఇంకా మనవాళ్ళ గుండెలలో తిష్టవేసి కూర్చుంది. ఇంగ్లీష్ పెత్తనం ఉద్యోగావకాశాలలో కూడా పెరిగింది. పరభాష పెత్తనం ఉపాధి అంశాలకే పరిమితం కాలేదు. జీవన సంస్కృతిపైన, సృజనాత్మర రంగాలపైన ఎంతో ఉంది. అవసరాలతో నిమిత్తం లేకుండా సకల జీవనరంగాల్లోకి తల్లిభాషని చెరిపేస్తూ ఆంగ్లం చొచ్చుకు వచ్చింది. ఈ పరిణమాల అన్య ప్రభావాలపైన అధికారంలో ఉన్నవారికి, రాజకీయ నాయకులకు చీమ కుట్టినట్లుగా కూడా లేదు. వాళ్లకిది పెద్ద రాజకీయ సమస్య కాదు. రాజకీయ ఎజెండాలో తల్లిభాష లేదు. భాషకు సంబంధించి కొన్నిసార్లు కొన్ని మంచి మాటలు వినిపిస్తుంటాయి. కానీ మాటలు కోటలు దాటుతున్నాయి కాని అడుగులు అరుగు దాటడం లేదన్న చందనంలా ఉంది పరిస్థితి.
ముఖ్యంగా భారతీయ భాషల గౌరవాన్ని కాపాడాలి. భాషల మధ్య సామరస్యాన్ని సాధించాలి. అప్పుడే భిన్నత్వంలో ఏకత్వం ఉందని నిరూపించుకోగలం. అలాగే ఎక్కడికక్కడ తల్లిభాషల్లోనే బోధన కొనసాగాలి. అమెరికా, చైనా, కొరియా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ లాంటి దేశాలల్లో విద్యాభ్యాసం వారి మాతభాషలలోనే కొనసాగుతుందనే నగసత్యాన్ని విస్మరించరాదు.
సాహితీపరంగా తెలుగుభాష పత్రికలు నామమాత్రంగానే ఉన్నాయి. అవి నిలదొక్కుకోలేక పోతున్నాయంటే, ఆర్ధిక గాఢాంధకారంలో రాజకీయ దత్తమైన మంచు పొగల మధ్య ఊపిరాడక పోవడం కూడా ఓ ముఖ్య కారణమే. పాఠక దేవుళ్లు లక్షల సంఖ్యలో ఉన్న కొని చదివే వారి సంఖ్య మాత్రం కొన్ని వందలలోనె ఉంటుంది. భాషా సాహిత్యాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అవసరం.
భాష, సాహిత్య తదితర ఆర్గనైజేషన్స్ ప్రభుత్వం చెప్పు చేతుల్లో లేకుంటే ఎప్పుడో 'గప్' మని మంటలకు అహుతి అవుతాయో నిర్ధాలించలేము! ఫలితంగా భాష తల్లి చిక్కిపోవడం, అనారోగ్యానికి గురికావడం సహజమే. అర్ధాంతంగా పత్రికలు, మ్యాగజైన్లు ఆగిపోవడం మనం గమనిస్తూనే ఉన్నాం.
నలుగురు ఇంగ్లీషులో మాట్లాడితే గౌరవం పెర్గుతుందనో, మాత భాష తెలుగులో మాట్లాడితే తగ్గుతుందనో లేక నామోషీగా ఉంటుందనో అనవసరమైన భేషజాలతో మసలుకోవడం కూడా తన మాత భాషకు మర్యాద ఇవ్వకపోవడమే. పైగా మాతభాష వాళ్లకు ఇదో సిగ్గుచేటు.
మన మాతభాషలో మాట్లాడుకోవడం అదో ఠీవి, రీతి. నలుగురు విన్నవాళ్లు కూడా మెచ్చుకొంటారు. తమ భాష మీద వాళ్లకున్న ప్రేమ అలాంటిది అని అనుకొంటారే తప్ప మాట్లాడే వారికి అది అగౌరవం కాదు. కేరళీయులు ఒకరినొకరు ఆత్మీయంగ పలకరించుకొంటారు. చిన్న-పెద్ద, హౌదాలనే తేడాలేకుండా. అలాగే బెంగాలీయులు కూడా. పైగా తమ మాతృభాషలో మాట్లాడి గర్వపడతారు. మనలా తప్పించుకోరు. భాషేతర ప్రాంతాలలో తెలుగువారని తెలిసి తెలుగులో పలకరిస్తే సంతోషించే బదులు చుట్టుప్రక్కల చూస్తుంటారు తమని ఎవరైన గమనిస్తున్నారా అని?
భారత రిజిష్ట్రార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ప్రకారం పందొమ్మిది వేల ఐదొందల అరవై తొమ్మిది అమ్మ భాషలు ఉన్నాయి. మన జనాభా 121 కోట్లు. ఇందులో 96.71 శాతం ప్రజలు మన ప్రభుత్వం గుర్తించిన 22 అధికారిక భాషల పరిధిలోకి వస్తారు. సాంకేతిపరంగా 10 వేల మందికి పైగా మట్లాడే ఒక భాష లేదా మాండలికాన్ని మాతభాషగా గుర్తిస్తారు.
తెలుగులో సాంకేతిక పరిజ్ఞానం గల భాషా పుస్తకాలు చెప్పుకోదగ్గవిగా లేవు. వివిధ అంశాలపై చేపట్టిన పరిశోధనాత్మక సాహిత్యం తెలుగులో ఎంతవరకు ఉన్నదో తెలిసిందే. నిజాం పాలకుల ఏలుబడిలోనే మెడిసిన్, ఇంజనీరింగ్ చదువులు ఉర్దూభాషలో ఉండేవన్నది సత్యం. కానీ ఇవాళ పదోతరగతి వరకు కూడా ఆంగ్లభాషలో చదువుతున్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో తెలుగు మాట్లాడితే దండించిన ఉదంతాలు ఎన్నో. తల్లిభాషపై తగిన గౌరవం లేని స్థితి పర్యవసానమే ఇలాంటి వాటికి అసలు కారణం.
కనుక తల్లిభాషగా తెలుగు సకల రంగాలలో అమలు కావలసిన అవసరముంది. మన భాషని మనం గౌరవించుకోడానికి, మన భాషలో మనం మాట్లాడేందుకు అవమాన పడక్కర్లేదన్న భావన బలపడాలి. ఉపాధి లేమి కారణంగానే పరాయిభాష వైపు చూస్తున్నారన్న మాట వింటున్నాం. అందుకే మాట్లాడేందుకు మన భాష, పొట్టతిప్పల కోసం మరోభాష అనే పరిస్థితి కొనసాగుతున్నది. కానీ పన్నెండు కోట్ల జనాభా గల జపాన్లో జపనీస్ భాషలోనే సకల వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఉపాధి కోసం మరో భాష నేర్చుకోవలసిన అగత్యం జపనీయులకు లేదు. అలాగే ఎనిమిది కోట్ల జనాభా కలిగిన జర్మనీలో జర్మన్లు జర్మనీలోనే వారి బతుకు నడుస్తున్నది. ఇంగ్లీషు నేర్వకపోతే బతుకు లేదనే దుస్థితి లేదు. కానీ పదిహేను కోట్లమందికి పైగా ఉన్న తెలుగువారు ఇంగ్లీషు చదవకపోతే బతుకు లేదనే స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మూడేళ్ళు దాటకముందే ఇంగ్లీషు బళ్ళకు పంపించేందుకు కసరత్తు చేస్తున్నారు. ఇష్టమున్నవారు ఇంగ్లీషు నేర్చుకుంటారు. కానీ పసిప్రాయం నుంచే ఇంట్లో ఒకభాష, చదువుల్లో మరో భాష అనే ఈ భయానక స్థితి ఎంత దుర్మార్గం. ఈ విషయమై ఆలోచించాలి. తల్లిభాష తెలుగు సకల రంగాల్లో వెలుగొందేలా ఏం చేయాలో యోచించాలి. మరీ ముఖ్యంగా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారు ఈవిషయమై స్పందించాలి.
- అమ్జద్