Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'చైనాలో కవితాయాత్ర' గ్రంథావిష్కరణ
డా||ఎన్. గోపి రచించిన 'చైనాలో కవితాయాత్ర' గ్రంథాన్ని ఈ నెల 18 వ తేదీ సాయంత్రం 6 గంటలకు, హైదరాబాద్ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో ప్రముఖ రచయిత్రి ఓల్గా ఆవిష్కరిస్తారు. డా.కె.వి.రమణాచారి అంకితాన్ని స్వీకరిస్తారు. డా||వోలేటి పార్వతీశం అధ్యక్షత వహిస్తారు. శ్రీ మామిడి హరికృష్ణ, డా||ఎస్.జతిన్ కుమార్, వల్లభనేని అశ్వని కుమార్, బైస దేవదాసు, డా.ఎస్.రఘు అతిధులుగా పాల్గొంటారు.
21న కామారెడ్డిలో ఎన్నీల ముచ్చట్లు
ఈ నెల 21వ తేదీన ప్రపంచ కవిత్వ దినోత్సవం ఎన్నీల ముచ్చట్లు సాహిత్య కార్యక్రమం కామారెడ్డిలోని కర్షక బీయిడి కళాశాలలో తెరవే ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. గజల్ కవి సురారం శంకర్ విమర్శకులు గన్ను కృష్ణమూర్తి, చాట్ల నర్సయ్య, కూకట్ల తిరుపతి, ప్రేమలాల్ పాల్గొంటారు
- సిరిసిల్లా గఫుర్ శిక్షక్, 9849062038
పలమనేరుకి మాడభూషి పురస్కారం
పలమనేరు బాలాజీ రాసిన 'ఒక సాయంత్రం త్వరగా ఇల్లు చేరినప్పుడు' కథా సంపుటికి గాను మాడభూషి రంగాచార్య కథా పురస్కారం ప్రకటించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నేషనల్ బుక్ట్రస్ట్ ప్రాంగణంలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. నగముని, ఏ.కె. ప్రభాకర్, బి.వి.ఎన్.స్వామి, డా|| నాలేశ్వరం శంకరం పాల్గొంటారు.
కథావిష్కారం పుస్తకావిష్కరణ
కె.పి.అశోక్కుమార్ పుస్తకం 'కథావిష్కారం' ఆవిష్కరణ సభ ఈ నెల 23వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి మినీహాలులో జరుగుతుంది. ఈ సభలో కె.వి.రమణాచారి, నందిని సిధారెడ్డి, మామిడి హరికృష్ణ, వాసిరెడ్డి నవీన్, లక్ష్మణ చక్రవర్తి, పి.సి.రాములు ప్రసంగిస్తారు.
'చింతకింది'కి పతంజలి పురస్కారం
చింతకింది శ్రీనివాసరావు 'కె.ఎన్.వై.పతంజలి 2019 పురస్కారా'నికి ఎంపికయ్యారు. ఈ నెల 29న విజయనగరం పౌరగ్రంథాలయంలో ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు.
తెలుగు వర్సిటీ పురస్కారానికి దరఖాస్తుల ఆహ్వానం
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, రంగస్థల కళలశాఖ ప్రతి సంవత్సరం మార్చి 27న ప్రపంచ రంగస్థల దినోత్సవం జరుపుకుంటుంది. ఇందులో భాగంగా జేఎల్ నర్సింహారావు పేరిట యువపురస్కారం అందజేస్తారు. నాటకరంగంలో వివిధ రంగాల్లో నటన, దర్శకత్వం, మేకప్, లైటింగ్, సెట్ తదితర సాంకేతిక అంశాల్లో కృషి చేసిన 35 సంవత్సరాల లోపు యువతీ, యువకులు ఈ పురస్కారానికి ఈ నెల 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రార్, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంవారికి పోస్టు ద్వారా లేదా స్వయంగా సంబంధిత వివరాలతో దరఖాస్తులు పంపంచ్చు.
పర్యావరణంపై కవితలపోటీ
సాహితీకిరణం దశమ వార్షికోత్సవం సందర్భంగా డా||పట్టాభికళాపీఠం సౌజన్యంతో పర్యావరణంపై కవితలపోటీ నిర్వహిస్తున్నారు. 20 నుండి 30 లైన్లకు మించకుండా కవితలను ఏప్రిల్ 30వ తేదీలోగా పంపాలి. చిరునామా సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్నెం.3, హైదరాబాద్-500102. సెల్ : 9490233148
జాతీయ స్థాయి కథల, కవితల పోటీ
'అక్షరాల తోవ - వురిమళ్ళ శ్రీరాములు స్మారక జాతీయస్థాయి కథల పోటీ', 'అక్షరాల తోవ - వురమళ్ళ పద్మజ' స్మారక జాతీయస్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నాయి. కథలు సామాజిక కోణంలో వుండి చేతి రాతలో నాలుగు పేజీలు (డిటిపి అయితే 2 పేజీలు) వుండాలి. కవితలు 25 లైన్లకు మించకూడదు. కథలు, కవితలను ఏప్రిల్ 10వ తేదీ లోపు రాచమళ్ళ ఉపేందర్, అక్షరాల తోవ, కేరాఫ్ : మణికంఠ ఆఫ్సెట్ ప్రింటర్స్, శాంతి లాడ్జి పక్కన, స్టేషన్రోడ్, ఖమ్మం చిరునామాకు పంపాలి. వివరాలకు : నామా పురుషోత్తం - 9866645218, దాసరోజు శ్రీనివాస్ - 9010972169.