Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రజలకోసం కలం పట్టి ప్రాణాలు అర్పించిన అక్షరయోధుడు షోయబుల్లాఖాన్. తన రచనలతో నిజాం ప్రభుత్వాన్ని గడగడలాడించిన సాహసి. లక్ష్యసాధనలో ప్రాణాల్ని సైతం లెక్కచేయని పత్రికా రచయిత. నిజాలు రాసినందుకే డెబ్బయ్యేండ్ల కిందట రజాకార్లు ఆయన్ని హతమార్చారు. 28 ఏళ్ళ వయసులోనే అసువులు బాసిన షోయబ్ అభిప్రాయాల కోసం బాధల్ని లెక్కచేయని సృజనశీలురకు గొప్ప ఉత్తేజం. తెలంగాణ జర్నలిజం చరిత్రలో ఆయనది సుస్థిరస్థానం. జర్నలిస్టుగా ఆయన ప్రయాణం ఆదర్శప్రాయం. ప్రతిక్షణాన్ని సృజనాత్మకంగా, నిర్భయంగా జీవించిన ఈ కలం వీరుడి త్యాగాల్ని స్మరించుకుంటూ ఆయన పేరిట 'నవతెలంగాణ' రచనల పోటీ నిర్వహించింది. ఈ పోటీ ఫలితాలను ఇక్కడ అందిస్తున్నాం. ఈ కవితలు, కథలు 'సోపతి' ఆదివారం సంచికలో ప్రచురితమవుతాయి.
బహుమతికి ఎంపికయిన పెద్ద కథలు
ప్రథమ బహుమతి : పిట్టలు - పర్కపెల్లి యాదగిరి
ద్వితీయ బహుమతి : వాగవతలి మడి - కొండి మల్లారెడ్డి
తృతీయ బహుమతి : ఒక రాత్రి - చింతపట్ల సుదర్శన్
ప్రత్యేక బహుమతి పొందిన కథలు
1) మనుగడ - సింహప్రసాద్
2) అందరూ శ్రీ వైష్ణవులే - వెంకటమణి ఈశ్వర్
3) కార్చిచ్చు పై కన్నీటి వాన - విరాజి
4) పల్లె బతుకులు - ఎనుగంటి వేణుగోపాల్
5) గూడు వదిలిన పక్షి - గుళ్ళ తిరుపతిరావు
6) మేలిమలుపు - ఎస్.కె.సలీమ
7) ఎవరు - సిహెచ్. శివరామప్రసాద్
8) స్పర్శ - డా. జడా సుబ్బారావు
9) తల్లివేరు - కె.వాసవదత్త రమణ
10) పూర్ణాహుతి - ఎమ్.సుగుణారావు
బహుమతికి ఎంపికయిన సింగిల్ పేజీ కథలు
ప్రథమ బహుమతి : సంఘం శరణంగచ్ఛామి-పుప్పాల కృష్ణమూర్తి
ద్వితీయ బహుమతి : రాకుమారి - ఎస్.ఏ. డేవిడ్
తృతీయ బహుమతి : విధాత - మల్లారెడ్డి మురళీమోహన్
ప్రత్యేక బహుమతి పొందిన సింగిల్ పేజీ కథలు
1) పసిడి మనసు - వురిమళ్ళ సునంద
2) బంధం - గొట్టిపర్తి యాదగిరిరావు
3) కలికాలం - కె. విజయప్రసాద్
4) మొదటి అడుగు - స్వర్ణశైలజదంట
5) కూత నేర్చినోళ్ళ కులం కోకిలంటరా-నండూరి సుందరీ నాగమణి
6) న్యాయం - కె.వి.మన్ప్రీతమ్
7) ప్రమాదం - శైలజామిత్ర
8) దోచేవారెవరురా - బి.కె. ఈశ్వర్
9) మార్పు - కప్పగంతు వెంకటరమణమూర్తి
10) తల్లి పక్షి - కొత్తపల్లి ఉదయబాబు
న్యాయ నిర్ణేతలు: వంశీకృష్ణ, శిరంశెట్టి కాంతారావు, యాకూబ్
బహుమతికి ఎంపికయిన కవితలు
ప్రథమ బహుమతి : పోడు నా జన్మహక్కు - పొతగాని సత్యనారాయణ
ద్వితీయ బహుమతి : సముచ్ఛేదము - ఒద్దిరాజు ప్రవీణ్కుమార్
తృతీయ బహుమతి : నిశ్శబ్దరుతువు - కొండి మల్లారెడ్డి
ప్రత్యేక బహుమతి పొందిన కవితలు
1. కొండెక్కుతున్న జీవితాలు - పద్మావతి రాంభక్త
2. అభిశంసన - అశోక్ అవారి
3. రా - కోటం చంద్రశేఖర్
4. మట్టిగౌరమ్మ - వడ్లకొండ దయాకర్
5. ఇది నా మొదటి మరణం కాదు - వెన్నెల
6. రహస్యం - షేక్ ఖాజామొహిద్దీన్
7. చీకటి తర్వాత చీకటిలా- అమ్జద్
8. చెమట దేహాలు - శైలజ బండారి
9. గో ఉగ్రవాది - ఎం.డి. ఉస్మాన్ఖాన్
10. నేనెవరిని - శ్రీధర్ చౌడారపు
న్యాయ నిర్ణేతలు : దర్భశయనం శ్రీనివాసాచార్య, శిలాలోలిత, ఏనుగు నరసింహారెడ్డి
సాధారణ ప్రచురణకు స్వీకరించిన కవితలు :
1. తీరు మారాలె - డేగల అనితాసూరి, 2. చిలకెగిరిపోయింది - జడా సుబ్బారావు 3. బాలనాగమ్మ - బండారి రాజ్కుమార్ 4. ఓ చిన్న మాట - పి. చంద్రశేఖర్ అజాద్ 5. గోడలు సిగ్గుపడుతున్నాయి- కమలేకర్ శ్యాంప్రసాదరావు 6. పరువు - సబ్బని లక్ష్మీనారాయణ 7. చెమట ఉప్పగా ఉన్నన్నాళ్ళూ - మల్లారెడ్డి మురళీమోహన్ 8. పరీవాహక ప్రజ - చొప్పదండి సుధాకర్ 9. జీవంలేని ప్రశ్న - కొత్తపల్లి ఉదయబాబు 10. తల్లి పేగు బంధం నా పల్లె - నామని సుజనాదేవి 11. హెచ్చరిక - చొక్కాపు లక్ష్మునాయుడు 12. చేరాల్సిన చోటు - పుట్టి గిరిధర్ 13. భాషే మనకు భాగ్యం - జి.రంగబాబు