Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్యంతో ఒక సాయంత్రం
తెలంగాణ సాహితీ ఆధ్వర్యంలో డా||కందేపీ రాణీప్రసాద్ 'సాహిత్యంతో ఒక సాయంత్రం' కార్యక్రమం ఈ నెల 15వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో నిర్వహిస్తారు. వక్తలు యలమర్తి అనూరాధ, నస్రీన్ ఖాన్.
కవి అంతరంగం
సాహితీ గౌతమి కరీంనగర్ సంస్థ ఈ నెల 21వ తేదీన ఉదయం పదిగంటలకు కరీంనగర్ ఫిలింభవన్లో 'కవి అంతరంగం' కార్యక్రమం నిర్వహిస్తున్నది. డా||నందిని సిధారెడ్డి గారు తన కవితా సంపుటి 'నీటి మనసు'పై స్వీయ అనుభూతులను అంతరంగ ప్రసంగం చేస్తారు. స్వీయ కవితలను వినిపిస్తారు. దేశపతి శ్రీనివాస్, వఝల శివకుమార్, డా||గండ్ర లక్ష్మణరావు ప్రసంగిస్తారు.
- సుదర్శనం వేణుశ్రీ, గాజుల రవీందర్
'తెలుగే గొప్ప భాష -కాని కనుమరుగౌతున్నది' ఆవిష్కరణ సభ
వంగూరి ఫౌండేషన్ ప్రచురించిన పారుపల్లి కోదండ రామయ్య గారి పుస్తకము 'తెలుగే గొప్ప భాష -కాని కనుమరుగౌతున్నది' ఆవిష్కరణ సభ ఈ నెల 15 సాయంత్రం 5 గంటలకు తెలుగు విశ్వవిద్యాలయం, ఎన్.టి.ఆర్ కళామందిరంలో జరుగుతుంది. దేవులపల్లి ప్రభాకర రావు, కె.వి.రమణాచారి, చెన్నూరు ఆంజనేయ రెడ్డి, ఆవుల మంజులత, దీర్ఘాశి విజయభాస్కర్, కె. శ్రీనివాస్, అద్దంకి శ్రీనివాస్, జ్యోతి వలబోజు, డా||వంశీరామరాజు, డా||తెన్నేటి సుధాదేవి పాల్గొంటారు.
జాతీయస్థాయి కథాసంపుటాల పోటీ
జి.వి.ఆర్.ఆరాధన కల్చరల్ ఫౌండేషన్ జాతీయస్థాయి కథా సంపుటాల పోటీ నిర్వహిస్తున్నది. రచయితలు, రచయిత్రులు 2018లో ప్రచురితమైన కథాసంపుటాల రెండు ప్రతులను మే 15 లోపు జి.వెంకటరెడ్డి, బి70/ఎఫ్ 1, పి.ఎస్.నగర్, విజయనగర్ కాలని, హైదరాబాద్ చిరునామాకు పంపాలి.
- వి.వి.రాఘవరెడ్డి