Authorization
Mon Jan 19, 2015 06:51 pm
30న శ్రామిక కవిత
మేడే, శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఈ నెల 30వ తేదీన హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో శ్రామిక కవిత మీద కవిసమ్మేళనం జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో నిఖిలేశ్వర్, కె.శివారెడ్డి, శిలాలోలిత, వల్లభాపురం జనార్దన్, కె.ఆనందాచారి, కె.చంద్రమోహన్, భూపతి వెంకటేశ్వర్లు, తంగిరాల చక్రవర్తి, నస్రీన్ఖాన్, అనంతోజు మోహనకృష్ణ, సలీమ, జి.నరేష్ పాల్గొంటారు.
అఖిల భారత నాటక పోటీలు
తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సౌజన్యంతో 'పరుచూరి రఘుబాబు స్మారక 29వ అఖిల భారత నాటక పోటీలు - 2019' మే 1 నుండి 3 వరకు రవీంద్రభారతిలో జరుగుతాయి. పరుచూరి రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహించే ఈ పోటీల్లో మొదటి రోజు 'భూమి దు:ఖం, తెగారం, తలుపులు తెరిచే వున్నారు, దాడి, నిర్జీవ నినాదం', రెండవరోజు 'ఆది గురువు అమ్మ, దయ్యం, అతీతం, హర్ష రుతువు', మూడవరోజు 'ఇదా నా దేశం, మనసు లోపలి మనిషి, రాజీనా..?' నాటకాలు ప్రదర్శితమవుతాయి.
కవిత్వంతో ఒక సాయంత్రం
విజయవాడ సాహితీ మిత్రులు నిర్వహిస్తున్న 'కవిత్వంతో ఒక సాయంత్రం' ప్రజాశక్తి నగర్ శిఖర స్కూల్ లో మే 1వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీరామ్, అనిల్ డ్యాని, గిరిధర్ అరసవల్లి, ఎ.కె.ప్రభాకర్, నామాడి శ్రీధర్, బండ్ల మాధవరావుతో పాటు 30 మంది కవులు కవిత్వ గానం చేస్తారు.
కందుకూరి శతవర్దంతి వ్యాస సంకలనానికి రచనల ఆహ్వానం
కందుకూరి వీరేశలింగం శతవర్దంతి మే 27తో ముగుస్తుంది. ఈ 100వ వర్దంతిని పురస్కరించుకుని విజయవాడలో 100 సంస్థలు కలిసి ప్రముఖ సినీ దర్శకులు సి. ఉమామహేశ్వర రావు కన్వీనర్గా 'కందుకూరి వీరేశలింగం శతవర్దంతి నిర్వహణ కమిటి' ఏర్పాటు చేశాయి. ఈ కమిటీ ఆధ్వర్యంలో మే 26 ఆదివారం విజయవాడ బెంజిసర్కిల్లోని వేదిక ఫంక్షన్హాల్లో రోజు మొత్తం సదస్సు జరుగుతుంది. ప్రముఖ రచయితలు, మేధావులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు. విజయవాడ నగరంలో రచయితల పాదయాత్రలు, పుస్తక ప్రదర్శనలు వంటి కార్యక్రమాలు దశల వారీగా జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రజాశక్తి బుకహేౌస్ వీరేశలింగం రచనలు కొన్నింటిని పునర్ముద్రిస్తున్నది. వాటితో పాటు కందుకూరి వీరేశలింగం సంఘసంస్కరణ ఉద్యమం, సాహిత్యం ప్రాసంగికతపై ప్రామాణిక రచనలతో వ్యాస సంకలనం వేయాలని నిర్ణయించింది. ప్రముఖ విమర్శకులు ప్రజాశక్తి బుకహేౌస్ గౌరవ సంపాదకులు డా|| రాచపాళెం చంద్రశేఖర రెడ్డి ఈ సంకలనానికి సంపాదకత్వం వహిస్తారు. రచయితలు తమ వ్యాసాలను మే 10వ తేదీలోపు ప్రజాశక్తి బుకహేౌస్, కేరాఫ్ ఎం.బి. విజ్ఞానకేంద్రం, 27-30-4, 3వ అంతస్తు, ఆకులవారి వీధి, గవర్నరుపేట, విజయవాడ - 520 002 చిరునామాకు లేదా prajasaktipulishinghouse@gmail.com పంపించవలసిందిగా కోరుతున్నాం. ఇతర వివరాలకు 9490099057 ద్వారా సంప్రదించవచ్చును.
- కె. లక్ష్మయ్య, జనరల్ మేనేజర్,
ప్రజాశక్తి బుకహేౌస్