Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గమనం' సాహిత్య వ్యాస సంపుటి ఆవిష్కరణ
డా||సూర్యాధనంజయ్ రచించిన 'గమనం' సాహిత్య వ్యాస సంపుటి ఆవిష్కరణ సభ ఈ నెల 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ రవీంద్ర భారతి సమావేశ మందిరంలో నిర్వహిస్తారు. ఈ సభలో డా||కె.వి.రమణాచారి, ఆచార్య మసన చెన్నప్ప, డా||నందిని సిధారెడ్డి, డా||మామిడి హరికృష్ణ, ప్రొ||వెలుదండ నిత్యానంద రావు, ప్రొ||రోజారాణి, ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి, డా||ఎస్.రఘు పాల్గొంటారు.
18న ఎన్నీల ముచ్చట్లు
తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో ఈ నెల 18 న ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమం జరుగుతుంది. కర్షక బిఈడీ కళాశాలలో ఈ కార్యక్రమానికి ఎనిశెట్టి గంగా ప్రసాద్ సమన్వయ కర్తగా వ్యవహరిస్తారు.
తెలంగాణ సాహిత్య సమాఖ్య ఆహ్వానం
తెలంగాణ రాష్ట్ర గ్రంథాలయం సౌజన్యంతో ఏర్పాటు చేసిన కవిత్వ విశ్లేషణా కార్యక్రమం 'ధ్వని - 6 (కవిత్వలయ)' ఈ నెల 18వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది. చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీలోని వట్టికోట ఆళ్వారుస్వామి నగరకేంద్ర గ్రంథాలయంలో జరిగే ఈ సభలో నాళేశ్వరం శంకరం, బాణాల శ్రీనివాస్ రావు, బిల్లా మహేందర్, పగడాల నాగేందర్, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, అయాచితం శ్రీధర్, నక్క హరికృష్ణ పాల్గొంటారు.
- చెమన్
'బాలప్రభలు' కోసం కథల ఆహ్వానం
'బాల ప్రభలు' బాలల సంచిక కోసం బాలబాలికల నుండి చక్కని కథలను ఆహ్వనిస్తున్నది. కథ ప్రింటులో ఒక పేజీకి మించకుండా చక్కని సందేశాన్ని కలిగి ఉండాలి. కథలను ఈ నెల 30వ తేదీలోగా డా.వైరాగ్యం ప్రభాకర్, ఇ.నెం: 2-102, సీతారాంపూర్ గ్రామం, కరీంనగర్ మం, తెలంగాణ రాష్ట్రం, 505002 చిరునామాకు పంపించాలి. వివరాలకు : 9014559059
'అక్షరాలతోవ' కథల పోటీ ఫలితాలు
'అక్షరాల తోవ, ఖమ్మం' జాతీయ స్థాయిలో నిర్వహించిన కథలు, కవితల పోటీ ఫలితాలు ప్రకటించింది. 'వురిమళ్ల శ్రీరాములు' స్మారక జాతీయస్థాయి కథల పోటీల్లో పోలాప్రగడ జనార్దనరావు (అంతర్మథనం), కూసుమంచి శ్రీదేవి (ఎవరు గొప్ప), శింగరాజు శ్రీనివాసరావు (మంచితనం బ్రతికే వుంది) లకు మొదటి మూడు బహుమతులకు ఎంపికయ్యారు. అలాగే 'వురిమళ్ల పద్మజ' స్మారక జాతీయస్థాయి కవితల పోటీల్లో చొక్కాపు లక్ష్మునాయుడు (బాల్యం తప్పిపోయింది), కటుకోజ్వల రమేష్ (నీ ప్రతిఘటన అనివార్యం), బండారి రాజ్కుమార్ (మెతుకు పెల్లలు) మొదటి మూడు బహుమతులకు ఎంపికయ్యారు. ఈ నెల 26వ తేదీ ఉదయం 10 గంటలకు ఖమ్మంలో బహుమతి ప్రదానోత్సవ సభలో ఈ బహుమతులను అందజేస్తారు. పూర్తి వివరాలకు : నామా పురుషోత్తం -9866645218, దాసరోజు శ్రీనివాస్ -9010972169, రాచమళ్ళ ఉపేందర్ - 9849277968
సహృదయ సాహితీ పురస్కారం -2018
ప్రముఖ కవులు ఒద్దిరాజు సోదరుల స్మృత్యంకంగా అందించే 'సహృదయ సాహితీ పురస్కారం - 2018' కోసం తెలుగు వచన కవుల నుండి రచనలను ఆహ్వానిస్తున్నారు. 2014- 2018 మధ్య కారంలో ప్రచురితమైన వచన కవితా సంపుటాలను జూన్ 15 లోగా కుందావఝుల కృష్ణమూర్తి, సాహిత్య కార్యదర్శి, శ్రీమాత ప్లాట్ నెం.207, ఇం.నెం.02-07-580, సెంట్రల్ ఎక్సయిజ్ కాలనీ, హనుమకొండ - 506001 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9849366652
- డా.ఎన్.వి.ఎన్. చారి, 9866610429