Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దేశాన్ని అమ్ముకునే వాళ్ళే పద్యానికి నోరుందని
దేశ ద్రోహ నేరం మోపుతారు!
పద్యానికి కుట్రలు తెలియవు
కుట్రల్ని భగం చేయడమే దాని పని!
నేతలు గడ్డి మేసినట్లు పద్యం మౌనాన్ని మేయదు!
నిర్బంధాలు పెరిగిన కొద్దీ
ప్రతి పద్యం భూనభోంతరాలను ఏకం చేస్తది!
రాజ్యం చేసిన వాళ్ళంతా చరిత్రలో మిగిలి పోరు!
జనహితం కాని పాలనేదైనా ఎల్ల కాలం సాగదు!
పద్యాలున్నంత కాలం భ్రమలెప్పటికీ శాశ్వతం కావు!
- కోట్ల వెంకటేశ్వర రెడ్డి,
9440233261