Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు సాహిత్య - సాంస్కృతికోద్యమాలలో చలసాని ప్రసాద్ది విలక్షణమైన పాత్ర. ఉద్యయం ద్వారా సాహిత్యాన్ని, సాహిత్యం ద్వారా ఉద్యమాన్ని పరిపుష్టం చేయడానికి కృషి చేశారు. శ్రీశ్రీ, కొ.కు, సమగ్ర సర్వస్వాల ముద్రణలో వారి అలభ్య రచనల కోసం ఆయన పడిన శ్రమ మరువలేనిది. తన అవసరాల కోసం ఇతరులకు పనులు పురమాయిస్తూ విరివిగా ఉత్తరాలు రాసే చలసాని ఉత్తరాలలో పుస్తకాల సేకరణ - సినిమా పాటల గురించిన చర్చ ఎక్కువగా కనబడటం విశేషం. 'రంగు మార్చకుండా దిక్కు మార్చిన రాజకీయ పార్టీ గొడుగు నీడలో నడుస్తున్నాడ'ని రాంభట్లను విమర్శిస్తాడు. 'విశ్వనాథ వచనం మీద గట్టిగా, దిట్టంగా కృషి చేయించండ'ని సలహానిస్తారు. రామోజీ వ్యాపార ప్రకటనల్లో దిట్ట. మంచి అడ్వర్టైజ్మెంట్ వుందని మెచ్చుకుంటారు. ప్రత్యగాత్మతో వున్న అనుబంధం, సినిమాల గురించిన విశేషాలు కూడా కొన్ని ఉత్తరాలలో కనిపిస్తుంది.
చలసాని ప్రసాద్ జాబులు, సంపాదకులు : సి.ఎస్.ఆర్.ప్రసాద్, పేజీలు : 294, వెల : 150/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- అశోక్కుమార్