Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'హౌరు పాట సాక్షిగా' ఆవిష్కరణ
తెలంగాణ రచయితల వేదిక తెరవే కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో జూన్ 1 వ తేదీన సాయంత్రం 5 గంటలకు కర్షక బీఈడీ కళాశాలలో గఫూర్ శిక్షక్ రచించి రూపొందించిన పాటల ఆడియో సిడి 'హౌరు పాట సాక్షిగా' ఆవిష్కరణ జరుగుతుంది. ఈ సభలో గాజోజు నాగభూషణం, డా||యస్.కె రషీద్, కూకట్ల తిరుపతి, సురారం శంకర్, గన్ను కృష్ణమూర్తి, గరిశకుర్తి రాజేంద్ర, చాట్ల నర్సయ్య, గంగాప్రసాద్, మంద పీతాంబర్లు పాల్గొంటారు.
- తెలంగాణా రచయితల వేదిక, కామారెడ్డి
'చలనం' పుస్తకావిష్కరణ
గుమ్మడిరాజు నరేష్ రచించిన 'చలనం' పుస్తకావిష్కరణ జూన్ 1వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం షోయబ్హాల్లో జరుగుతుంది. ఇందులో భూపతి వెంకటేశ్వర్లు, ఆచార్య ఎన్ గోపి, జి.రాములు, ఎస్.వినయకుమార్, మోతుకూరు నరహరి, ప్రొ||ఎస్.సుదర్శన్ రావు, యం.శ్రీనివాస్, కె.హిమబిందు, మహమ్మద్ అబ్బాస్, పి.ఆశయ్య, తంగిరాల చక్రవర్తి, నస్రీన్ఖాన్, సలీమ, డి.సైదులు పాల్గొంటారు.
బాలల కథలకు ఆహ్వానం
చిల్డ్రన్స్ ఎడ్యుకేషనల్ అకాడమి - బాలచెలిమి, బాలల వికాస పత్రిక సంయుక్తంగా ఎం.వేదకుమార్ సంపాదకత్వంలో తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల వారిగా కథా సంకలనాలను ప్రచురించనుంది. ఈ సంకలనం కోసం రచయితల నుండి కథలను ఆహ్వానిస్తున్నారు. రచయితలు బాలల విజ్ఞానం, వినోదం, వికాసాలకు సంబంధించిన కథలను జూన్ 15వ తేదీలోపు రెండు పేజీలకు (ఎ4) మించని కథలను పంపాలి. ఉమ్మడి జిల్లాల వారీగా ప్రచురించే ఈ సంకలనాలు ఎంపిక చేసిన కథలతో ప్రచురిస్తారు. కథలను పంపాల్సిన జిల్లా ఇంచార్జిల వివరాలు : ఆదిలాబాద్- తోకల రాజేశం (9676761415), మెదక్- ఉండ్రాల్ల రాజేశం (9966946084), నల్లగొండ- కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి (8309779691), కరీంనగర్- కూకట్ల తిరుపతి (9949247591), వరంగల్- దండె రాజమౌళి (7702649820), మహబూబ్నగర్- డా||భీంపల్లి శ్రీకాంత్ (7981812260), నిజామాబాద్ - ఘనపురం దేవేందర్ (9030033331), ఖమ్మం - డా||అమ్మిన శ్రీనివాసరాజు (7729883223), హైదరాబాద్ -బెల్లంకొండ సంపత్కుమార్ (9908519151), రంగారెడ్డి - పైడిమర్రి రామకృష్ణ (9247564699). వివరాలకు : గరిపల్లి అశోక్, 9849649101