Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆ గ్రామంలో మత్స్యసహకార సంఘంలో మొత్తం 54 మంది సభ్యులు. కాగా రాష్ట్ర ప్రభుత్వం గంగపుత్రులకు సబ్సిడీపై టూ వీలర్, ఫోర్ వీలర్ వాహనాలను అందజేసింది. ఆ గ్రామానికి 12 టూ వీలర్లు, ఒక ఫోర్ వీలర్ మంజూరైంది. దీంట్లో భాగంగా ఫోర్ వీలర్ కోసం నలుగురు దరఖాస్తు చేసుకోగా కుమ్మరి గంగారాంకు లక్కీడ్రాలో వాహనం వచ్చింది. దీన్ని సహించని కులసభ్యులు గంగపుత్ర సంఘానికి రూ.50 వేలు కట్టాలని డిమాండ్ చేశారు. చర్చల అనంతరం రూ.25 వేలు కట్టినా కులబహిష్కరణ చేశారు. దీంతో బాధితుడిని నెల రోజుల నుంచి చేపలు పట్టనివ్వకుండా ఉపాధికి దూరం చేశారు.
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం ఆలూర్ గ్రామంలో మత్స్యసంఘంలో 54 మంది సభ్యులు న్నారు. సంఘానికి అధ్యక్షునిగా మగిడి నగేశ్ వ్యవహ రిస్తున్నారు. కాగా గతేడాది రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకా రులకు ద్విచక్ర వాహనాలు, టాటా ఏఎస్ ఫోర్ వీలర్ వాహనాలను లక్కి డ్రా పద్ధతిన సబ్సిడీపై అందజేసి ంది. కాగా ఆలూరు గ్రామానికి 12 టీవీఎస్ ఛాంప్ వాహనాలు మంజూరు కాగా, ఒక ఫోర్ వీలర్ మం జూరైంది. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో లక్కి డ్రా తీయగా 12 మంది సభ్యులకు టీవీఎస్ వాహనాలను అందజేశారు. కుమ్మరి గంగారామ్కు ఫోర్ వీల్ వాహనం వచ్చింది. గతేడాది మంజూరు కాగా, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో అందజేశారు.
గంగారామ్కు ఫోర్వీలర్ వాహనం రావడంపై సంఘం సభ్యులు కక్ష పెంచుకున్నారు. ఫోర్ వీలర్కు నలుగురు దరఖాస్తు చేసుకోగా డ్రాలో గంగారామ్కు వచ్చింది. సొసైటీ అధ్యక్షులు మగిడి నగేష్ ప్రోత్సాహంతోనే కుమ్మరి గంగారామ్కు టాటా ఏస్ మంజూరైందని, కావున సంఘానికి రూ. 50 వేలు కట్టాలని సభ్యులు డిమాండ్ చేశారు. దీంతో లబ్దిదారుడు తాను చెల్లించలేనని కరాఖండిగా చెప్పారు. చర్చల అనంతరం రూ.25 చెల్లించేందుకు ఇరువురూ అంగీకరించారు. అయితే బాధితుడు రూ.25 వేలు కట్టిన తర్వాత సంఘం సభ్యులు మాట మార్చారు. ఇంకా డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయసాగారు. కట్టలేనని చెప్పడంతో కులబహిష్కరణ చేశారు. కులసంఘం సభ్యులు సమావేశమై డబ్బులు డిమాండ్ చేస్తుండగా, సంఘం అధ్యక్షుడి తమ్ముడు శంకర్ సెల్ఫోన్లో చిత్రించి అధ్యక్షుడికి పంపాడు. ఆ వీడియో ఫుటేజీ లను అధ్యక్షుడు నగేష్ మత్స్యశాఖ అధికారులకు పంపాడు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న కుల సభ్యులు అధికారులకు ఎందుకు పంపారని సొ సైటీ అధ్యక్షుడు నగేశ్, సొదరుడు శంకర్ కుటుంబా లను సైతం కులబహిష్కరణ చేశారు. నెల రోజుల నుంచి చెరువులో చేపలు పట్టుకోనివ్వడం లేదని, దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని బాధితులు వాపోయారు. ఈ విషయం మత్స్యశాఖ జిల్లా అధికా రుల దృష్టికి తీసుకెళ్లగా సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచిస్తున్నారే తప్ప చర్యలు తీసుకోవడం లేదని వారు ఆరోపించా రు. రెండు రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేశామని, త్వర లో కలెక్టర్ను కలవనున్నామని బాధితులు తెలిపారు.
సెల్ : 966646336