Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పర్యావరణ పరిరక్షణకై 'బుద్దుని సన్నిధి - కవితా పెన్నిధి' కార్యక్రమం ఈ నెల 17వ తేదీ సాయంత్రం 4 గంటలకు టాంక్బండ్ బుద్దవిగ్రహం దగ్గర జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 60 మంది సభ్యులు పర్యావరణంపై కవితాగానం నిర్వహిస్తారు. వివరాలకు : భూపతివెంకటేశ్వర్లు, 9490098343
నవలా స్రవంతి
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా 'నవలా స్రవంతి'లో భాగంగా ఈ నెల 14వ తేదీన సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్హాల్లో భాస్కరభట్ల కృష్ణారావు 'వెల్లువలో పూచిక పుల్లలు' పై ఆడెపు లక్ష్మీపతి ప్రసంగం వుంటుంది. సభకు డా||నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
- డా||ఏనుగు నరసింహారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమి కార్యదర్శి
కవితా సంపుటాల ఆహ్వానం
తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు పాలమూరు సాహితీ అవార్డు ఆహ్వానం పలుకుతోంది. 2018 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాల మూడు ప్రతలను ఈ నెల 30 వ తేదీ లోపు డా||భీంపల్లి శ్రీకాంత్, ఇం.నెం.8-5-38, టీచర్స్ కాలనీ, మహబూబ్నగర్ - 509001, తెలంగాణ చిరునామా కు పంపాలి.
- డా||భీంపల్లి శ్రీకాంత్, 9032844017
'స్వాతంత్య్రానంతర తెలుగు హిందీ కవిత్వంలో
స్త్రీ' ఆవిష్కరణ
డా||సి.భవానీదేవి రచించిన 'స్వాతంత్య్రానంతర తెలుగు, హిందీ కవిత్వంలో స్త్రీ' ఆవిష్కరణ సభ ఈ నెల 20వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి సమావేశ మందిరంలో జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ, కిన్నెర ఆర్ట్ థియేటర్ సంయుక్త నిర్వహణలో జరిగే ఈ కార్యక్రమంలో ఆచార్య ఎన్.గోపి, మామిడి హరికృష్ణ, డా||వోలేటి పార్వతీశం, ఆచార్య ఎస్వీ రామారావు, యస్.స్వయంప్రభ, డా||ఎస్.రఘు, డా||పి.జ్యోతి పాల్గొంటారు.
ప్రతిలిపి కవితల పోటీ
ప్రతిలిపి నిర్వహించే కవితల పోటీకి కవితలను ఆహ్వానిస్తున్నారు. కవితలను జులై రెండవ తేదీ లోపు అందేటట్లు పంపాలి.
- ప్రతిలిపి