Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాక్టర్ శాంతి నారాయణ రచనల ఆవిష్కరణ
డాక్టర్ శాంతి నారాయణ రచించిన నవల 'నాలుగు అస్తిత్వాలు, నాలుగు నవలికలు', కాలమ్ కథలు 'నాగల కట్ట సుద్దులు' ఆవిష్కరణ సభ ఈ నెల 5వ తేదీ సాయంత్రం 6,00 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఈ సభలో కె.శివారెడ్డి, కె. రామచంద్రమూర్తి, నందమూరి లక్ష్మీపార్వతి, మామిడి హరికృష్ణ, మేడిపల్లి రవికుమార్, ఏ.కె. ప్రభాకర్ పాల్గొంటారు.
- పాలపిట్ట బుక్స్
'నానీల పయనం' ఆవిష్కరణ సభ
మాయకుంట్ల నారాయణరెడ్డి కృతి 'నానీల పయనం' ఆవిష్కరణ ఈ నెల 5వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు త్యాగరాయగానసభలో జరుగుతుంది. ఈ సభలో డా||ఎన్.గోపి, డా||పత్తిపాక మోహన్, కళాజనార్దన మూర్తి, కెప్టెన్ వై.ప్రభాకర్రెడ్డి, రమణ వెలమకన్ని, రాపోలు సీతారామరాజు పాల్గొంటారు.
- డా||పోరెడ్డి రంగయ్య, 9948049864
మల్లు స్వరాజ్యం ఆత్మ కథ ఆవిష్కరణ
మల్లు స్వరాజ్యం ఆత్మకథ 'నా మాటే తుపాకీ తూటా' ఆవిష్కరణ సభ ఈ నెల 7వ తేదీ ఉదయం 10.30 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది.
'మొగ్గల'కు ఆహ్వానం
తెలుగు సాహిత్య చరిత్రలోనే తొలిసారిగా ఒకే ప్రక్రియ ఒకే అంశంపై 516 మందికవులతో మొగ్గలు కవితా సంకలనాన్ని వెలువరిస్తున్నారు. ఈ కవితాసంకలనం కోసం కవులు, సాయిబాబా మీద ఐదు మొగ్గలు రాసి డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇం.నెం.8-5-38,టీచర్స్ కాలనీ, మహబూబ్ నగర్-509001 అనే చిరునామాకు జూలై 10 వ తేదీ లోపల పంపవలసిందిగా కోరుతున్నారు.
- సృజామి-8639260193, భీంపల్లి శ్రీకాంత్-9032844017