Authorization
Mon Jan 19, 2015 06:51 pm
16 న కామారెడ్డిలో ఎన్నీల ముచ్చట్లు
ఈ నెల 16వ తేదీన తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కర్షక్ బీయీడి కళాశాలలో ఎన్నీల ముచ్చట్లు కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో సూరారం శంకర్, గన్ను కృష్ణమూర్తి, చాట్ల నర్సయ్య, అల్లి మోహన్రాజ్, డా|| నమిలకొండ సునీత పాల్గొంటారు.
- యెనిశెట్టి గంగాప్రసాద్, మంద పీతాంబర్
అబ్బూరి ఛాయాదేవిపై మృణాళిని ప్రసంగం
సాహిత్య అకాడెమీ, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా ఈ నెల 16వ తేదీన సాయంత్రం 5.45 గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో సి.మృణాళిని వక్తృత్వంలో అబ్బూరి ఛాయాదేవి జీవితము - సాహిత్యము అంశం మీద 'నా దృష్టిలో...' కార్యక్రమం నిర్వహిస్తుంది.
'నీటిదీపం' ఆవిష్కరణ సభ
తండ హరీష్ గౌడ్ కవితాసంపుటి 'నీటిదీపం' ఆవిష్కరణోత్సవం ఈ నెల21వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి కె.శివారెడ్డి, జూలూరు గౌరీశంకర్, కవి యాకూబ్, ఆచార్య సూర్యధనంజరు, బైస దేవదాసు, డా||సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డా||ఎస్.రఘు, భూపతి వెంకటేశ్వర్లు, తగుళ్ళ గోపాల్, అనంతోజు మోహన్కృష్ణ తదితరులు పాల్గొంటారు.
వరంగల్ రచయితల సంఘం కవితలకు ఆహ్వానం
ఈ మధ్య తొమ్మిది నెలల పసిపాప శ్రీహితపై జరిగిన విషాద సంఘటన పై కవితలు, పాటలతో ఒక పుస్తకం తీసుకురావాలని వరంగల్ రచయితల సంఘం నిర్ణయించింది. కవులు తమ కవితలను, పాటలను ఈ నెల 31వ తేదీ లోగా 'నల్లెల రాజయ్య, ఇం.నెం.7-1-384/6, పద్మాక్షి కాలనీ, హన్మకొండ - 506011, వరంగల్ అర్బన్' చిరునామాకు పంపాలి. వాట్సప్ నెం. 9989415571
'సబ్బని కవి పల్కు సత్యమెపుడు' ఆవిష్కరణ
సబ్బని లక్ష్మీనారాయణ రచించిన 'సబ్బని కవి పల్కు సత్యమెపుడు' పద్యకావ్యం ఆవిష్కరణ సభ ఈ నెల 16వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు జగిత్యాలలో జైశెట్టి రమనయ్య స్వగృహంలో జరుగుతుంది. శరత్ సాహితీ కళా స్రవంతి ఆధ్వర్యంలో జరిగే ఈ సభలో సంకేపల్లి నాగేంద్రశర్మ పాల్గొంటారు.
సాహిత్య సమాలోచన సమావేశం
ఈ నెల 16న సాయంత్రం ఆరు గంటలకు త్యాగరాయగానసభలో 'మహాకవి శ్రీశ్రీ సాహిత్యం - వ్యక్తిత్వం' పై సాహిత్య సమాలోచన, సుధామ రచించిన 'వసుధాసమయం' గ్రంథావిష్కరణ జరుగుతాయి. ఈ సభలో దాసరి శ్రీనివాసులు, వేల్పుల నారాయణ, కళా జనార్దనమూర్తి, సుధామ, ఆచార్య వంగపల్లి విశ్వనాథం, డా||కె.బి.లక్ష్మి పాల్గొంటారు.
తెలంగాణ సాహిత్య అకాడమి ప్రకటన
తెలంగాణ సాహిత్య అకాడమి నిర్మిస్తున్న 'తెలంగాణ సాహిత్య గ్రంథ సూచి' నిర్మాణం చివరి దశకు చేరుకుంది. కాబట్టి ఈ గ్రంథ సూచిలో నమోదు కాని తెలంగాణ కవులు/ రచయితలు వెంటనే తమ రచనల వివరాలు నమోదు చేసుకోగలరు. వివరాలు ఈ విధంగా ఉండాలి....రచయిత పేరు /పుస్తకం పేరు/ ప్రక్రియ/ ప్రచురణ సంవత్సరం/ పుటలు/ వెల/ ప్రచురణ సంస్థ పేరు. పూర్తి వివరాలకు 9494715445/ 8184859060/ 9963815484/ 9247335278.
కథలకు ఆహ్వానం
కస్తూరి మురళీకృష్ణ, కోడీహళ్ళి మురళీమోహన్ల సంపాదకత్వంలో దీపావళి కథా సంకలనానికి రచయితల నుండి కులం అంశం కేంద్రంగా కథలను ఆహ్వానిస్తున్నది. సంచిక వెబ్ పత్రిక, సాహితి ప్రచురణలు సంయుక్తంగా ప్రకటిస్తున్న ఈ సంకలనానికి కొత్తగా రాసినవైనా, గతంలో ప్రచురితమైనవైనా పంపవచ్చు. కథలను ఆ మెయిల్/ వాట్సాప్, పోస్ట్ ద్వారా సెప్టెంబర్ 25లోగా ప్లాట్ నెం. 32, ఇం.నెం.8-48, ఆదిత్య హాస్పటల్ లేన్, రఘురాం నగర్ కాలనీ, దమ్మాయిగూడ, హైదరాబాద్ 83 చిరునామాకు పంపాలి. ఇ మెయిల్ : kmkp2025@gmail.com , mmkodihalli@gmail.com. వాట్సాప్ నెం. : 9849617392