Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాలమూరు సాహితి ఆధ్వర్యంలో కోట్ల వెంకటేశ్వరరెడ్డి రచించిన 'మనుమసిద్ధి, అంతర్వాహిని' కవితా సంపుటాల ఆవిష్కరణ సభ ఈ నెల 17న సాయంత్రం 5 గంటలకు మహబూబ్ నగర్ జిల్లా మెట్టుగడ్డలోని లిటిల్ స్కాలర్స్ హై స్కూల్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కడియాల జగన్నాథశర్మ, డా|| భీంపల్లి శ్రీకాంత్, డా|| ఏనుగు నరసింహారెడ్డి, డా|| భాస్కరయోగి, జలజం సత్యనారాయణ, గుడిపాటి, వి.మనోహర్ రెడ్డి, బుర్రి వెంకట్రామారెడ్డి లు పాల్గొంటారు.
- డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, అధ్యక్షులు, పాలమూరు సాహితి
ముట్లూరి కమలమ్మ స్మారక జాతీయస్థాయి దీపావళి కథల పోటీ -2019
సాహితీకిరణం సహకారంతో నిర్వహిస్తున్న ముట్లూరి కమలమ్మ స్మారక జాతీయ స్థాయి దీపావళి తెలుగు చిన్నకథల పోటీకి కథలను ఆహ్వానిస్తున్నారు. తెలుగుదనం ఉట్టిపడే కథలు రాతప్రతిలో ఐదు పేజీలలోపు, డిటిపిలో అయితే రెండు పేజీలు వుండాలి. కథను పంపే కవరుపై ముట్లూరి కమలమ్మ స్మారక జాతీయ దీపావళి చిన్నకథలపోటీకి అని స్పష్టంగా రాసి, సెప్టెంబర్ 30వ తేదీలోపు సాహితీకిరణం, ఇం.నెం.11-13-154, అలకాపురి, రోడ్ నెం.3 హైదరాబాద్-500102 చిరునామాకు పంపాలి. వివరాలకు : 040-29550181, 9490751681
- పొత్తూరి సుబ్బారావు