Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాహిత్య - సాంస్కృతిక సమ్మోహనం - 2019
శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబుల్ సౌసైటీ అకాడమీ 38వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 23వ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు హైదరాబాద్ తెలుగు యూనివర్సిటీ లో 'సాహిత్య - సాంస్కృతిక సమ్మోహనం - 2019' నిర్వహిస్తున్నారు. అర్చన ఫైన్ఆర్ట్స్ సంయుక్తంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో రెండు నెలల క్రితం నిర్వహించిన కథల పోటీ విజేతలకు బహుమతి ప్రదానం, ఐదుగురు విశిష్ట వ్యక్తులకు సత్కారం వుంటాయి. డా||మండలి బుద్ధ ప్రసాద్, డా||కె.విరమణాచారి, డా||ఓలేటి పార్వతీశం, డా|| అమృతలత, డా||తెన్నేటి సుధాదేవి, శిరోమణి డా||వంశీరామరాజు, ఆచార్య ఎండ్లూరి సుధాకర్ పాల్గొంటారు.
- జ్యోతి వలబోజు
ధ్వని -7 కవిత్వ విశ్లేషణ కార్యక్రమం
'ధ్వని'-7 (కవిత్వలయ) కవిత్వవిశ్లేషణ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ ఉదయం 10 గంటలకు అఫ్జల్గంజ్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీ హెరిటేజ్ బిల్డింగ్లో జరుగుతుంది. తెలంగాణ చైతన్య సాహితి ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో గీతాంజలి, పొన్నాల బాలయ్య, వడ్డెబోయిన శ్రీనివాస్ల కవిత్వపఠన కార్యక్రమం; డా|చింతకింది కాశీం కవిత్వ విశ్లేషణా ప్రసంగం ఉంటుంది. ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, అయాచితం శ్రీధర్, సిహెచ్. ఉషారాణి పాల్గొంటారు.
- డా||చెమన్, తెలంగాణ చైతన్య సాహితి
'అనాచ్ఛాదిత కథ' ఆవిష్కరణ సభ
ఝాన్సీ కొప్పిశెట్టి 'అనాచ్ఛాదిత కథ' నవల ఆవిష్కరణ సభ ఈ నెల 24వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఎ.జగన్నాథశర్మ, కె.శివారెడ్డి, ఓల్గా, మామిడి హరికృష్ణ, కె.పి.అశోక్కుమార్, జ్యోతి, స్వాతి రౌతు పాల్గొంటారు.
24న 'మూడు పదులు-ముప్పై కావ్యాలు' పరిచయ సభ
డా|| ఉమ్మడిశెట్టి రాధేయ రాసిన 'మూడు పదులు-ముప్పై కావ్యాలు' కవిత్వ విశ్లేషణ వ్యాస సంపుటి పరిచయ సభ సాహితీ సోపతి ఆధ్వర్యంలో ఈ నెల 24న సాయంత్రం 6గంటలకు కరీంనగర్ ఫిలిమ్ భవన్లో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో డా|| లంకా శివరామ ప్రసాద్, డా|| ఉమ్మడిశెట్టి రాధేయ, అన్నవరం దేవేందర్, నగునూరి శేఖర్, గాజోజు నాగభూషణం, అన్వర్, డా|| తైదల అంజయ్య, కందుకూరి అంజయ్య, సి.వి. కుమార్ తదితరులు పాల్గొంటారు.
- కూకట్ల తిరుపతి, 99492 47591