Authorization
Mon Jan 19, 2015 06:51 pm
భరోసా కథా సంపుటిలో ఒకటి రెండు కథలు మినహాయించి ప్రతి కథలో రచయిత ఏదో ఒక సందేశాన్ని ఇచ్చారు. భరోసా కథలో మాట ఇస్తే తప్ప రాదు అనే సందేశాన్ని ఇచ్చారు. ఈ కథలో ఇచ్చిన మాట తప్పని ఆవు కథనూ ప్రస్తావించారు. 'ఎట్లా బతకబోతాడో' కథలో క్షమాగుణాన్ని మించినది లేదనే సందేశాన్ని ఇచ్చారు.
'చంపదగిన యట్టి శత్రువు... పొసగి మేలు జేసి పొమ్మను టయెచాటు' అనే వేమన పద్యం ఈ కథ చదవగానే గుర్తుకు వస్తుంది. క్విజ్ మాస్టర్ కథ ద్వారా విజయం కంటే విలువలు గొప్పవి. సాధించిన విషయంతో పాటు సాధనమార్గం కూడా ముఖ్యమైందనే సందేశాన్ని రచయిత ఇచ్చారు. మనుషులెప్పుడూ నిస్సహాయుడివైపే ఉంటారనే సత్యాన్ని ధర్మామీటర్ కథలో తెలిపారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొని ముందుకు పోతే విజయం సిద్ధిస్తుంది అనే సందేశాన్ని మొదటి 'పిచ్చుక కథ' ద్వారా ఇచ్చారు. వైట్ బోర్డు కథలో పిల్లలు పెద్దలను అనుసరిస్తారు అనే సత్యాన్ని తెలిపారు. ఈ కథలన్నీ చదివించేవిగా వున్నాయి. వాస్తవ పరిస్థితులను విస్మరించకుండా అర్థవంతమైన సంభాషణలతో ఉమామహేశ్వర్ కథలను నడిపారు. హరితవిప్లవం అనే కథకు చెట్టు తిరుగుబాటు అనే శీర్షిక వుంచితే బాగుండేది. ఈ కథలో చెట్టు తిరగబడుతుంది. హరిత విప్లవం అంటే మరో అర్థం వస్తుంది కదా!
భరోసా (కథల సంపుటి), రచయిత : జి.ఉమామహేశ్వర్, పేజీలు : 168, వెల : 120/-, ప్రతులకు : నవోదయ పుస్తక కేంద్రాలు.
- తెలిదేవర భానుమూర్తి, 9959150491