Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ అధికార భాషగా వుండేది. మెజార్టీ హిందువులకు చదువుకునే సౌకర్యాలు లేకపోవడం, వుంటే ఉర్దూ మాధ్యమంలోనే చదవాల్సి రావడంతో చాలామంది చదువుకు దూరంగానే వుండిపోయారు. దీనికి భిన్నంగా ఉర్దూభాషలో చదువుకుని అందులో పాండిత్యం సంపాదించినవారు కూడా వున్నారు. ముస్లింలతో పాటు ఉర్దూ నేర్చుకున్న హిందువులు కూడా తమ ప్రతిభతో ఉర్దూ భాషా సాహిత్య వికాసానికి తోడ్పడగలిగారు. మతాలతో సంబంధం లేకుండా ఉర్దూ భాషలో వివిధ ప్రక్రియల మీద సాధికారికంగా రచనలు చేసినవారు ఎందరో వున్నారు. కాని వారి గురించి తెలుగులో తగినంత సమాచారం దొరకడం లేదు. ఈ లోటును పూరించడానికి లక్ష్మణరావు పతంగే 1975లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురించిన శ్రీమతి జీనత్ సాజిదా గారి సంపాదకత్వంలో వెలువడిన 'హైదరాబాద్ కే అదాబ్' అనే పుస్తకానికి చేసిన అనువాదమే ఈ పుస్తకం. ఇందులో 62 మంది ఉర్దూ సాహిత్యకారుల గురించి సంక్షిప్త పరిచయం వుంది. వీరిలో సాహిత్యకారులు, కథకులు, నవలాకారులు, నాటక కర్తలు, హాస్య రచయితలు, చరిత్ర కారులు, ధార్మిక రచయితలు, జర్నలిస్టులు, అనువాదకులు వున్నారు. సంక్షిప్త పరిచయాలే అయినప్పటికీ ఉర్దూ భాషా సాహిత్యం గురించి తెలుసుకోవాలనే వారికి ఈ పుస్తకం ఉపయోగపడుతుంది.
హైదరాబాదీ ఉర్దూ సాహిత్య కారులు, అనువాదం : లక్ష్మణరావు పతంగే, పేజీలు : 112, వెల : 100/-, ప్రతులకు : 9290079047
- కె.పి.అశోక్కుమార్,
9700000948