Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేణుక అయోల కవిత్వ సంపుటి 'ఎర్రమట్టి గాజులు' ఆవిష్కరణ సభ ఈ నెల 21వ తేదీ రవీంద్రభారతి మినీ హాల్లో సాయంత్రం ఆరు గంటలకు జరుగుతుంది. ఈ సభలో కె. శివారెడ్డి, విమల, కె.అనసూయ, ప్రసాదమూర్తి, జి.లక్ష్మీనర్సయ్య, జ్యోతి, మామిడి హరికృష్ణ పాల్గొంటారు.
షేక్ హుస్సేన్ సత్యాగ్నికి మల్లెమాల పురస్కారం
షేక్ హుస్సేన్ సత్యాగ్నికి ఈ సంవత్సరపు మల్లెమాల పురస్కారం ప్రకటించారు. ఈ పురస్కారాన్ని ఈ నెల 22వ తేదీ ఉదయం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో అందజేస్తారు.
- డా||మల్లెమాల వేణుగోపాల్రెడ్డి
నిత్యానందరావుకి బోయి భీమన్న పురస్కారం
డా|| వెలుదండ నిత్యానందరావుకి భీమన్న పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5.30 గంటలకు త్యాగరాయగానసభ లలితకళా వేదికలో ఈ పురస్కారాన్ని అందజేస్తారు. కళానిలయం, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సభలో సముద్రాల వేణుగోపాలాచారి, ఆచార్య ఎస్.వి.రామారావు, లయన్ కళా వి.యస్.జనార్దనమూర్తి, హైమవతీ భీమన్న, ఆచార్య డి.సూర్యధనంజరు, డా||పి.వి.ఉమాశశి, డా||గురజాడ శోభాపేరిందేవి పాల్గొంటారు.