Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మణిపూసల అవార్డులు- 2019 ప్రదానోత్సవం
'మణిపూసల కవి శిరోమణి' పురస్కారాలను ఈ నెల తొమ్మిదవ తేదీ ఉదయం 10 గంటలకు ఇవ్వనున్నారు. హైదర్ షా కోట్ లోని ఎస్.ఎం.పి. మోడల్ స్కూల్లో జరిగే ఈ కార్యక్రమానికి శ్రీధర్, డా|| సూర్య ధనంజరు, దోరవేటి చెన్నయ్య, పి.ప్రభాకర్ రెడ్డి, బి.రామచంద్రారెడ్డి, చిక్కారామదాసు, వడిచర్ల సత్యం తదితరులు హాజరవుతారు.
తెలంగాణ చైతన్య సాహితి - నెలనెలా వెన్నెల
సామాన్యశాస్త్రం ఆర్ట్ గ్యాలరీ, మణికొండలో 'తెలంగాణ చైతన్య సాహితి - నెలనెలా వెన్నెల' సాహిత్య కార్యక్రమం ఫిబ్రవరి 9వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరుగుతుంది. కవిత్వం, కథా సృజనలలో ఆసక్తి కలవారందరికీ ఆహ్వానం.
- ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్
రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారాల ప్రదానం
శ్రీరామ్ రచించిన 'అద్వంద్వం' కవితా సంపుటి 'రంగినేని ఎల్లమ్మ సాహిత్య పురస్కారం - 2019' కి ఎంపికయింది. ఈ నెల తొమ్మిదవ తేదీన సిరిసిల్లలో కవికి పురస్కారం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్, జూకంటి జగన్నాథం, జిందం కళాచక్రపాణి, మద్దికుంట లక్ష్మణ్, పత్తిపాక మోహన్, నాగిళ్ళ రమేష్, రంగినేని నవీన్ కుమార్ పాల్గొంటారు.
క్యాతం కృషా్ణరెడ్డి సాహిత్య పురస్కారం
క్యాతం కృష్ణారెడ్డి సాహిత్య పురస్కారం 2020 కి గాను ఏనుగు నరసింహారెడ్డి 'మూలమలుపు', దేవనపల్లి వీణా వాణి 'నిక్వాణ' ఎంపికయ్యాయి. వీరికి తొమ్మిదవ తేదీన నిజామాబాద్లో పురస్కారాలను అందజేస్తారు. ఇదే సభలో బైసా దేవదాసుకి జీవనసాఫల్య పురస్కారాన్ని బహూకరిస్తారు.
- పొద్దుటూరి మాధవీ లత, 9030573354
కవితా సంపుటాలకు ఆహ్వానం
'కొత్తపల్లి నరేంద్ర బాబు సాహిత్య పురస్కారం - 2020' కోసం కవితా సంపుటాలను ఆహ్వానిస్తున్నారు. 2019 సంవత్సరంలో వచ్చిన కవితా సంపుటాలు నాలుగు కాపీలను ఈ నెల 20 తేదీ లోగా అక్షర మాలి, 6-2-982-3, రాంనగర్ ఎక్స్టెన్షన్, వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర, అనంతపురం - 515004 చిరునామాకు పంపాలి. వివరాలకు : 9493832470
జాతీయ బహుభాషా కవి సమ్మేళనం
ఫిబ్రవరి 16 వ తేదీ మంచిర్యాల జిల్లా రచయితల సంఘం ఆధ్వర్యంలో జాతీయ బహుభాషా కవి సమ్మేళనం జరుగుతుంది. ఇందులో చదివే కవుల రచనలతో 'మన భాష మన శ్వాస' అనే పుస్తకం ఆవిష్కరణ జరుగుతుంది. ఇదే సభలో మడిపల్లి భద్రయ్య రాసిన 'మన భాష మన యాస' పుస్తక పరిచయం జరగనుంది. వివరాలకు 9963427242 వాట్సాప్ నంబర్లో సంప్రదించగలరు.
- బొడ్డు మహేందర్, అధ్యక్షుడు, మంచిర్యాల జిల్లా రచయితల సంఘం
బోనాల కవితలకు ఆహ్వానం
2020 జులై, ఆగస్టు నెలల్లో జరిగే బోనాల ఉత్సవ సందర్భంగా హైదరాబద్ పాత నగర కవుల వేదిక బోనాలపై ప్రత్యేక కవితా సంచికను వెలువరించ సంకల్పించింది. అందుకోసం అమ్మవారి భక్తికి సంబంధించిన అంశాలపై 30 వాక్యాలకు మించని కవితలను మార్చి 30 లోపు పంపాలి. వివరాలకు : వాట్సాప్ నెం. 9182178653. ఇ మెయిల్ : hari.rao666@gmail.com