Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలంగాణ సాహిత్య అకాడమి నెలనెలా 'నవలా స్రవంతి'లో భాగంగా ఈ నెల 14వ తేదీ సాయంత్రం ఆరు గంటలకు రవీంద్రభారతి కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. ఇందులో భాగంగా పి.వి.నరసింహారావు నవల 'లోపలి మనిషి' పై పరాంకుశం వేణుగోపాల స్వామి ప్రసంగం వుంటుంది. డా||నందిని సిధారెడ్డి అధ్యక్షత వహిస్తారు.
-డా||ఏనుగు నరసింహారెడ్డి, కార్యదర్శి-తెలంగాణ సాహిత్య అకాడమి
డా|| ఎన్. గోపికి జీవన సాఫల్య పురస్కారం
భారతీయ భాషా పరిషత్, 2019 సంవత్సరానికిగాను డా|| గోపికి జీవన సాఫల్య పురస్కారాన్ని (కర్తృత్వ సమగ్ర సమ్మాన్) ప్రకటించింది. ఈ పురస్కారానికి గాను లక్ష రూపాయల నగదు, సన్మాన పత్రం, అంగవస్త్రం ప్రదానం చేస్తారు. ఈ మేరకు మార్చి 21వ తేదీ కలకత్తాలోని పరిషత్ సభాగారంలో జరిగే ప్రత్యేక సమావేశంలో (అలంకరణ సమారోV్ా) పురస్కార ప్రదానం జరుగుతుంది. డా|| ఎన్. గోపి రచించిన 'కాలాన్ని నిద్రపోనివ్వను, జలగీతం, నానీలు, వృద్ధోపనిషత్' తదితర గ్రంథాలు హిందీతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైనాయి.
వీడియో కవితలకు ఆహ్వానం
ప్రతిలిపికి పంపిన కవితలను చదువుతూ వీడియో తీసుకొని మాకు పంపినట్లు అయితే ప్రతిలిపి యూట్యూబ్ ఛానల్లో ఆ వీడియోలను అప్లోడ్ చేసి, ఉత్తమమైన కవితలకు నగదు బహుమతులు అందజేస్తారు. చివరి తేది : మార్చి 15. వివరాలకు : తెలుగు ప్రతిలిపి, 7259511956.