Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఏ చరిత్ర పుస్తకం చూసినా విజయనగర సామ్రాజ్య స్థాపన గురించి, శ్రీకృష్ణదేవరాయల పూర్వీకుల గురించి, అతని యుద్ధయాత్రలు, రాజ్యపాలన గురించి వివరిస్తుంది. వీటితోపాటు రాయలనాటి ప్రజాజీవనం, రాజ్యపాలన, వర్తక వ్యాపారాలు, కళాపోషణ మొదలైన సాంస్కృతిక విషయాలను వివిధ అధ్యాయాలుగా విభజించి యస్.డి.వి.అజీజ్ అందజేస్తున్న విశ్లేషణా గ్రంథం ఇది. విజయనగర స్థాపన మొదలుకొని విజయనగర పతనం వరకు రాసిన ఈ గ్రంథంలో ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ,సాంస్కృతిక విశేషాలను వివరించడం దీని ప్రత్యేకత. ఎంతో శ్రమించి అనేకానేక పుస్తకాలను తిరగేసి ఒక చక్కటి ప్రణాళిక ప్రకారంగా విషయ సేకరణ- విశ్లేషణలతో ఈ పుస్తకాన్ని ఒక సిద్ధాంత గ్రంథంలా తీర్చి దిద్దడంలో పరిశోధకుడు చేసిన కృషి ప్రశంసనీయం.
మూరురాయగండడు శ్రీకృష్ణదేవరాయలు (సమగ్ర విశ్లేషణ), యస్.డి.వి.అజీజ్, పేజీలు : 226, వెల : 200/-, ప్రతులకు : ప్రముఖ పుస్తక కేంద్రాలు.
- కె.పి.అశోక్కుమార్,
9700000948