Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గడ్డిపూలు' ఆవిష్కరణ - బాల కవి సమ్మేళనం
వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం చౌదర్పల్లి ఉన్నత పాఠశాల విద్యార్థుల కవితా సంకలనం 'గడ్డిపూలు' ఆవిష్కరణ, బాల కవిసమ్మేళనం ఈ నెల 20 తేదీన పాఠశాల ఆవరణలో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో రేణుకాదేవి, బైస దేవదాస్, మద్ది శ్రీహరిరెడ్డి, రెడ్నం కృష్ణారావు, కల్వకోటి రాంరెడ్డి, గంటా మనోహర్ రెడ్డి, చల్లా మల్కిరెడ్డి, వడిచర్ల సత్యం తదితరులు పాల్గొంటారు.
చింతకింది శ్రీనివాసరావుకు కొలకలూరి పురస్కారం
డాక్టర్ చింతకింది శ్రీనివాసరావుకు ప్రతిష్టాత్మకమైన కొలకలూరి విశ్రాంతమ్మ నవలాపురస్కారం లభించింది. 2020 సంవత్సరానికిగాను చింతకింది రాసిన 'బుగతలనాటి చుక్కపల్లి' నవలకు ఈ గౌరవం దక్కింది. ఈ నెల 26 వ తేదీన తెలుగువిశ్వవిద్యాలయంలో జరిగే పురస్కార ప్రదానోత్సవంలో ఈ అవార్డు అందజేస్తారు. నగదు, జ్ఞాపిక, శాలువతో సత్కరిస్తారు. కథకునిగా, నవలాకారునిగా, నాటకకర్తగా చింతకింది తెలుగునాట సుపరిచితం. కళింగయాసభాషల్లో వెల్లువెత్తే ఆయన కథలన్నీ చదువరులను ఆలోచింపజేసేవేే. శ్రీనివాసరావు రచించిన దాలప్పతీర్థం, కాన్పులదిబ్బ, కప్పస్తంభం కథాసంకలనాలు ప్రఖ్యాతమయ్యాయి. వర్తమాన సామాజికపరిస్థితులకు తగినవిధంగా పురాణాలను పునర్నిర్వచిస్తూ చింతకింది రాసిన అదిగోద్వారక, వికర్ణ నవలలు విమర్శకుల ప్రశంసలు పొందాయి.
జాతీయ స్థాయి 2019 కథల సంపుటాల పోటీ
2019లో ప్రచురితమైన కథల సంపుటాల రెండు ప్రతులకు ఏప్రిల్ 30 వ తేదీ లోపు గుడిబండి వెంకటరెడ్డి, బి70/ఎఫ్ 1, పి.యస్.నగర్, విజయనగర్ కాలనీ, హైదరాబాద్ - 500057, తెలంగాణ చిరునామాకు పంపాలి.