Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''నూనం వ్యాకరణం కత్స్నం అనేన బహుధాశతమ్
బహువ్యాహరతానేన నకించిదపశబ్దితమ్''
(కిష్కింధా కాండ-శ్రీ మద్ రామాయణమ్)
(ఇతడు వ్యాకరణాన్ని పూర్తిగా, బాగా విని ఉన్నాడు. అందువల్ల ఈతని వ్యవహారంలో ఒక్క అపశబ్దమూలేదు)
సుగ్రీవుని దూతగా వచ్చిన హనుమంతుని మాటలు విన్న రాముడు, తనపక్కనే ఉన్న లక్ష్మణునితో అన్నమాటలివి. ఈ సందర్భంలో చెప్పిన అనేక శ్లోకాలు భాషావ్యవహారంలోని సార్థకతను, ప్రయోజనాన్ని చెబుతాయి. వాటిలోని కళాత్మకతను కూడా చెబుతాయి. నిజానికి వ్యాకరణం భాషను నియంత్రిస్తుందని, ప్రయోగాన్ని నియమబద్ధం చేస్తుందని చాలావరకు కొన్ని అపోహలున్నాయి. వ్యాకరణం ప్రయోగంలోని నియమాలను చెబుతుంది కాని, అది కట్టడి చేయడం కాదు. వ్యవహారంలోని వాగర్థాలను సూత్రబద్ధంగా నిరూపిస్తుంది.
వ్యాకరణం చదవడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి.
1. (వేదానాం అధ్యయనార్థం) ప్రాచీన కాలంలోని గ్రంథాలను, వేదాలు మొదలైనవాటిని అధ్యయనం చేయడానికి. ఏ పదాన్ని ఏ రూపంలో ఏ లింగవచన విభక్తుల్లో ప్రయోగించారో తెలుసుకోవడానికి. ఈ అంశం ప్రాచీన సాహిత్యానికి కూడా వర్తిస్తుంది.
2. (లింగవచన విభక్తి పరివర్తనాయ) లింగవచన విభక్తులలో జరిగే మార్పులు తెలుసుకోవడం కోసం.
3. (అసందేహార్థం) శబ్దాల, వాక్యాల స్వభావాన్ని అర్థం చేసుకోవడం కోసం. వీటిని అర్థం చేసుకోకపోవడం వల్ల అనేకమైన సందేహాలు కలుగుతాయి.
4. (అనర్థకం మా అధిగీష్మని) తప్పు అర్థాన్ని పొందకుండా ఉండేందుకు... ఇలా మరికొన్ని చెప్పుకోవచ్చు. అందువల్ల వ్యాకరణం గతంలోని ప్రయోగాన్ని నిర్దిష్టంగా అర్థం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది. ఆ మార్గంలో ప్రయోగించడం వల్ల భవిష్యత్తుకు అర్థమయ్యేందుకు సానుకూలంగా ఉంటుంది. అందుకే పూర్వంలో ఒక సుభాషితం వ్యాకరణాధ్యయనాన్ని గురించి చెప్పింది.
''యద్యది బహునాధీశే తథాపి పుత్ర పఠ వ్యాకరణమ్
స్వజనశ్వజనో మాభూత్ సకలంశకలం సకచ్ఛకత్''
(పుత్రా !ఎన్ని శాస్త్రాలు చదివినప్పటికీ కూడా వ్యాకరణాన్ని అధ్యయనం చేయి. ఎందుకంటే స్వజనులు (బంధువులు) శ్వజనులు (కుక్కలు) కాకుండా, సకలం (అంతా) శకలం (ముక్క) కాకుండా, సకత్ (ఒకసారి) శకత్ (పెండ-ఎరువు) కాకుండా ఉంటుంది.)
పదాల్లోని చిన్నవ్యత్యాసం, మార్పు అనర్థాలకు దారితీస్తుంది. కొన్ని సార్లు విశేషమైన అధ్యయనం ఉన్నవాళ్ళకూ సందేహం తప్పక పోవచ్చు. సంస్కత వ్యాకరణంలో ''వైయ్యాకరణ ఖసూచ్ణి'' అని ఒక సమాసబంధం ఉంది. ''వ్యాకరణ పండితుడు ఆకాశం వైపు చూస్తున్నాడని'' దాని అర్థం. అందువల్ల వ్యాకరణంలో లోతైన పరిజ్ఞానం ఏర్పడడం అసాధ్యం కాదుగాని చాలా శ్రమించాలి. అలాకాని సమయంలో గతంలోని కావ్యాల, గ్రంథాల ప్రయోగాలను అర్థం చేసుకోడానికి ఇబ్బందులు పడక తప్పదు. కనుక కనీస పరిజ్ఞానం ఉండడం తప్పని సరి. ఈ కాలంలో చిన్న తరగతుల నుంచి ప్రాచీన సాహిత్యం పాఠ్యాంశాలుగా ఉంటుంది. అందువల్ల కనీసంగానన్న వ్యాకరణం నేర్చుకోవాల్సిన అవసరం అన్ని స్థాయిల విద్యార్థుల్లో ఉంది. అలాంటి కనీస పరిజ్ఞానానికి ఇదిగో ఇలాంటి ''సులభ వ్యాకరణము'' ఉపయోగపడుతుంది. ఎంతటి కఠిన విషయమైనా బోధించే గురువును, ఉపాధ్యాయుణ్ణి బట్టి సులభమౌతుంది. బొంత లచ్చారెడ్డి సుదీర్ఘమైన బోధనలో విశేషానుభవంతో ఈ పుస్తకాన్ని ముందుకు తెచ్చారు. ఇది మాధ్యమికోన్నత పాఠశాల విద్యార్థులనుండి డిగ్రీ, పీజీ పరీక్షలతో పాటు తెలుగును ఐచ్ఛికంగా ఎన్నుకున్న విద్యార్థులందరికీ ఉపయోగం. లోతైన అవగాహన కాకుండా తెలుగు వ్యాకరణాన్ని నేర్చుకోవాలనుకునే వారికి కూడా ఉపయోగకర మైనది.
లచ్చారెడ్డి బాగ అవసరమైన సమాచారాన్ని ఎన్నుకుని దానికి సాధారణంగా కావలసిన, అర్థం చేసుకోడానికి బాగా ఉపయోగపడే ఒక ప్రణాళికను రూపొందించుకుని రాశారు. క్రమాన్ని చూస్తే ఇది అర్థమవుతుంది. మొదటగా అక్షరాల గురించి తెలిపారు. వ్యాకరణపరిభాషలో దీనిని ''సంజ్ఞా''అని అన్నప్పటికి, తాను 'తెలుగు అక్షరమాల' (వర్ణ సమామ్నాయము) అని ఇచ్చారు. ఇందులోనూ తత్సమ, తద్భవ, దేశ్య, గ్రామ్యాలను నిర్వచనాత్మకంగా చెప్పారు. అన్యదేశ్యాలను వేరుగా చెప్పడం గమనించదగింది. బహుజనపల్లి ''అంగూర్'' లాంటి వాటిని కూడా దేశ్యాల్లో చేర్చారు. నిజానికి దేశ్యాలను గురించి సరైన దష్టితో వ్యాకరణాన్ని రాసిన పండితుడు ''తొల్కాప్పియనార్'' ఆయన దేశీ, వ్యవహారదేశీ, కావ్యదేశీ, అన్యదేశీ మొదలైన నాలుగు భాగాలు చేశాడు. లచ్చారెడ్డి అన్యదేశీని చెప్పడంలో ఈ అంశాన్ని గమనించారు. కొంతమేరకు దేశీని అన్యదేశ్యంగా గుర్తించిన వ్యాకరణాలున్నాయి గాని. మిగతా విభాగాలు తక్కువ. ఈ క్రమంలో పదాన్ని గురించి కూడా మంచి సమాచారాన్నిచ్చారు. సాధారణంగా వ్యాకరణాల్లో లభించని వాక్యాలను గురించి ఇక్కడ ప్రస్తావించడం కనిపిస్తుంది. నిజానికి వాక్యాలను గురించి తెలుగులో ఆచార్య చేకూరి రామారావు పుస్తకం ''తెలుగు వాక్యం'' గొప్ప ఆకరగ్రంథం. సాధారణ అవసరం మేరకు ఈ వాక్యాల నమూనాలను ఇవ్వడం ఇక్కడ కనిపిస్తుంది.
విరామచిహ్నాలు... రచనాపద్ధతిలోకి చేరుతాయికాని వ్యాకరణానికి సంబంధించినవి కావు. కాని రచనకు ఉపయోగపడేందుకు వాటిని ఇందులో పరిచయం చేశారు. తరువాతి భాగం ''సంధి'' అన్ని వ్యాకరణాల్లో సంధి ప్రకరణాలుంటాయిగాని, తెలుగు వ్యాకరణాల్లో తెలుగు సంధులను, సంస్కత వ్యాకరణాల్లో సంస్కత సంధులను మాత్రమే చెబుతారు. ఇందులో రెండూ కొంతమేరకు కనిపిస్తాయి. ''సవర్ణ, గుణ, వద్ధి, యణాదేశ, అనునాసిక, శ్చుత్వ, జశ్త్వ, విసర్గ'' సంధులను పరిచయం చేశారు. విసర్గలో అనేక రకాలున్నా ''విసర్గలోప'' లాంటి అరుదైన వాటిని వదిలి మిగతావాటిని పరిచయం చేశారు. తెలుగు సంధులు సుమారు ఇరవై రెండు వరకు చెప్పారు. తెలుగు సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాళ్లకు సంస్కత సంధుల పరిచయం చాలా అవసరం. ఈ అవసరాన్ని ఇది పూరిస్తుంది.
తరువాత భాగంలో సమాసాన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలో ''తత్సమ సమాసం, మిశ్రమ సమాసం, ఆచ్చీక సమాసాన్ని'' చెప్పడం సిద్ధ సమాసాన్ని ప్రస్తావించడంలో ఆయనకున్న లోతైన అవగాహన, విద్యార్థుల అవసరం కనిపిస్తుంది. సుమారు ఆరు సమాసాలను ఈ క్రమంలో ఉదాహరణలతో చూపారు. వ్యాకరణంలో ఆచ్చీక, తత్సమ, కదంత, తద్ధిత ప్రకరణాలుంటాయి. సాధారణ విద్యార్థులకు వీటిపై ప్రశ్నలు తక్కువ. అందువల్లే వాటిదాకా పోకుండా ముగించి అత్యంత అవసరమైన ఛందస్సు, అలంకారాల వైపు మరలినారు.
ఛందస్సులో గణాలు, వాటిని తయారు చేసుకునే పద్ధతి, పద్యాల్లో వత్తాలు, జాతులు, ఉపజాతులు ఉదహరించి మార్గ దేశీలను వాటి బేధాన్ని ప్రస్తావించారు. దేశీ గురించి నామ మాత్రంగా పరిచయం ఉన్నా, ఇదో విభాగమున్నదనే జ్ఞానం విద్యార్థులకు ఇది అందజేస్తుంది. అలంకారాల్లో శబ్ద, అర్థాలంకారాలు రెంటినీ చెప్పారు. ఉపమాలంకారాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు 'లుప్తోపమల' గురించి ప్రస్తావించారు గాని అవి తొమ్మిది రకాలుగా ఉంటాయన్న వివరణ దాకా వెళ్ళలేదు. బహుశ్ణ కేవలం అలంకార నిర్మాణాన్ని గురించిన అవగాహనకోసమే ఇలా చేసి ఉంటారనిపిస్తుంది. వీటితరువాత వ్యతిరేకపదాలు, నానార్థాలు, పర్యాయాలతో లఘునిఘంటువు నిచ్చారు. స్థూలంగా విద్యార్థులకు తెలుగుపైన అవగాహన ఇచ్చే ''మార్గదర్శి''గా ఈ పుస్తకాన్ని రూపొందించారు రచయిత.
విశేషమైన బోధనానుభవంలో, పర్యవేక్షణలో విద్యార్థులకు ఏమికావాలో, ఏది అనవసరమో రచయిత గమనించారు. విశ్రాంతిలో ఉండి కూడా విద్యార్థుల మేలు కోసం శ్రమకోర్చి ఈ పుస్తకాన్ని రూపొందించడం ఆయనకు విద్యార్థులపై గల అవ్యాజమైన ప్రేమానురాగాలను, వాత్సల్యాన్ని తెలుగుపై ఆయనకు గల మమకారాన్ని చెబుతున్నాయి. ఈ అవకాశాన్ని ఎందరు సద్వినియోగం చేసుకుంటారో చూడాలి.
- ఎం. నారాయణ శర్మ,
98483 48502