Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకోకుండా కవిత్వంతో వెలిగించి చైతన్యాన్ని నింపడానికి పూనుకున్నాడు కనకాచారి. తన 'సాహిసి' సంపుటిలో తన పంధా ఎప్పుడు ప్రజా సమస్యలపైనే అని స్పష్టం చేసాడు. ''నేలపై అందరికి తిండి పెడుతున్న అన్నదాత బతుకు చీకటిని వెలుగు కాగడాతో దూరం చేయాలి'' అంటాడు. పర్యావరణం పై స్పహ కలిగిస్తూ ఓ కవితలో అంటాడు ''పడే ప్రతి వాన చినుకు మొక్కకు ప్రాణం పోయాలి/మొక్కలు నాటుదాం రండి'' అంటూ కాలుష్య నివారణకు మొక్కల పెంపకం ఒక మార్గమని సూచిస్తాడు.
ఒక 'బహిష్కతుడు'లో మనిషిలోని ఒంటరి తనాన్ని, ఎదుటివారి స్పందనలను చక్కగా వివరించాడు. ''పలకరింపు కొక్కానికి చిక్కిన అలజడి పరుగు/ నేను తేరుకొని చూద్దునుకదా/ ఒంటరిగా ఒడ్డునే ఆగిపోతాను'' అంటూ ప్రేమ కోసం పరిత పిస్తాడు. మనిషైనా చెట్టు అయినా త్యాగం చేస్తేనే మనుగడ కదా..కొన్ని దుఃఖాలను జయించాలంటే ఏ రావి చెట్టు జ్ఞాన బోధనా చెయ్యాల్సిందే అది బుద్ధుడికే కాదు మనకి అవసరమంటాడు 'తాళం' కవితలో. ''గాఢ నిద్ర పట్టిన ఏ రాత్రో /మనసు పొరలు మెల్లిగా తొలుగుతూ/ సత్యం ఆవిష్కరించబడుతుంది / రావి చెట్టు కింద బుద్ధుడికే కాదు/మనకు ఎప్పుడో ఇలా ఏ పగలో రాత్రో /మనకి మనం ఎదురవుతాం'' అనడం హృద్యంగా ఉంది. కనకాచారి పాత్రికేయ వత్తిలోఉండటం మూలాన సమస్యలపై మరింత అవగాహనతో ఆర్ద్రమైన రీతిన కవితలు రాస్తున్నారు. పాఠకుల్లో చైతన్యస్ఫూర్తిని ప్రోది చేసే ఈ కవిత్వంలో వస్తువైవిధ్యం పుష్కలంగా వుంది.
- పుష్యమీ సాగర్, 901035031