Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'లాక్డౌన్-వలస కార్మికులు' అంశంపై తెలంగాణ సాహితి - ప్రేరణ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో కవితల పోటీ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలో మొదటి బహుమతి-3000, ద్వితీయ బహుమతి-2000, తృతీయ బహుమతి-1000, పది ప్రోత్సాహక బహుమతులకు-500 రూపాయల చొప్పున అందిస్తారు. అలాగే పాల్గొన్న ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం ఇస్తారు. ఈ పోటీకి పంపించే కవిత 25 లైన్లకు మించకూడదు. వలస కార్మికుల సమస్యలపైనే ఉండాలి. కవితను ఏ పత్రికలకు పంపలేదని, సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదని, ఈ పోటీ నిమిత్తమే రాసినదని హామీపత్రం తప్పక జతచేయాలి. దీనిలో తమ పేరు, పూర్తి చిరునామా తప్పనిసరి. ఒకరు ఒక కవితను మాత్రమే పంపించాలి.
మీ కవితలు ఇక్కడ ఇచ్చిన నెంబర్లలో ఏదో ఒక దానికి వాట్సాప్ చేయాలి : 9490099083, 9491039520, 7386046936
కవితలు పంపాల్సిన చివరి తేది: 25 మే 2020